తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్ మార్కులు!
కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే.. మొదటి ఏడాదిలో వచ్చినన్ని మార్కులనే విద్యార్థులకు రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్బోర్డు యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు
పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే ఇదే మార్గం
రికార్డులతోనే ప్రయోగ పరీక్షల మార్కులు
ప్రత్యామ్నాయాలపై ఇంటర్బోర్డు కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే.. మొదటి ఏడాదిలో వచ్చినన్ని మార్కులనే విద్యార్థులకు రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్బోర్డు యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 1న సమీక్షించి కరోనా పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అప్పటికి కరోనా తగ్గే అవకాశం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరీ ఆలస్యమైతే మళ్లీ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వైద్య విద్యతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీలు తదితరాల్లో ప్రవేశాలకు సమస్య అవుతుంది. జవాబుపత్రాల మూల్యాంకనానికి ప్రైవేట్ అధ్యాపకుల వెనకడుగు కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుంది. అంతేకాక ఈ విద్యా సంవత్సరంలో 20-25 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగినందున పరీక్షల నిర్వహణ కూడా సమంజసం కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్బోర్డు అధికారులు సైతం పరీక్షలు జరగకపోతే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. తొలి ఏడాది మార్కుల ఆధారంగా ఇవ్వటమే తగిన ప్రత్యామ్నాయమన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి.. తదనంతరం పరీక్షలు జరిపినప్పుడు మళ్లీ రాసుకునే ఐచ్ఛికం కూడా ఇస్తారు.
ప్రయోగ పరీక్షలూ లేనట్లే
విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు సైతం జరిగేలా లేవు. అలాంటప్పుడు విద్యార్థులు రాసే సైన్స్ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించాలని ఇంటర్బోర్డు భావిస్తోంది.
ఫీజులకు ముడిపెట్టొద్దు
ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు పంపిన నైతిక, మానవీయ విలువలు; పర్యావరణ విద్య అసైన్మెంట్ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను మే 3వ తేదీలోపు ఇంటర్బోర్డుకు పంపాలని బోర్డు కార్యదర్శి జలీల్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ఫీజులకు, మార్కులకు ముడిపెట్టవద్దని హెచ్చరించారు. రుసుములు చెల్లించనందున అసైన్మెంట్లను తీసుకోవడం లేదని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్