అమానవీయం: శునకాన్ని బైక్‌కు కట్టి..

పెంపుడు శునకాన్ని ద్విచక్రవాహనం వెనకభాగంలో కట్టి పరిగెత్తించి గాయపరిచిన ఘటన కేరళలోని ఎడక్కరలో చోటుచేసుకుంది. జేవియర్‌ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను ద్విచక్రవాహనం వెనకభాగంలో కట్టి పరిగెత్తించి క్రూరంగా ప్రవర్తించాడు....

Published : 18 Apr 2021 18:57 IST

తిరువనంతపురం: పెంపుడు శునకాన్ని ద్విచక్రవాహనం వెనకభాగంలో కట్టి పరిగెత్తించి గాయపరిచిన ఘటన కేరళలోని ఎడక్కరలో చోటుచేసుకుంది. జేవియర్‌ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను ద్విచక్రవాహనం వెనకభాగంలో కట్టి పరిగెత్తించి క్రూరంగా ప్రవర్తించాడు. దాదాపు 3 కిలోమీటర్లు కుక్కను పరుగెత్తించి హింసించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యజమానిపై జంతు సంక్షేమ చట్టం కింద కేసు నమోదు చేశారు. పెంపుడు జంతువు పట్ల క్రూరంగా ప్రవర్తించిన జేవియర్‌ను అరెస్టు చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని