COVID19: కొవిడ్ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్ సంతకం
వుహాన్లో కొవిడ్ పుట్టుకపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు త్వరలో సమాచారం బహిర్గతం చేయనున్నాయి. ఈమేరకు బైడెన్ ఓ బిల్లుపై సంతకం చేశారు.
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్(Covid 19) మూలాలకు సంబంధించి వుహాన్ ల్యాబ్పై సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బహిర్గతం చేసే బైపార్టేషన్ (ఇరు పార్టీలు అంగీకరించిన) బిల్లుపై నేడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు. దీంతో కొవిడ్ మూలాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన రహస్య సమాచారం బయటపెట్టేందుకు అవకాశం లభించింది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్లోని సెనెట్, రిపబ్లికన్లు ఆమోదించారు. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపై సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. అక్కడ జరిగిన పరిశోధనలతో కొవిడ్ వ్యాప్తికి ఉన్న సంబంధాలను ఈ ఇంటెలిజెన్స్ వెల్లడించే అవకాశం ఉంది. కాకపోతే వీటి వివరాలను వెల్లడించే క్రమంలో సున్నితమైన సోర్సులను, ఇంటెలిజెన్స్ సంస్థ అనుసరించిన పద్దతులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొవిడ్ మూలాలపై భిన్నాభిప్రాయలను వెల్లడిస్తున్నాయి. చాలా సంస్థలు ల్యాబ్ నుంచి లీకైనట్లు చెబుతుంటే.. మరికొన్ని మాత్రం జంతువుల నుంచి పాకినట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కొవిడ్ కారణంగా 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై బైడెన్ సంతకం చేస్తూ.. ‘‘కొవిడ్ మూలాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మా ఇంటెలిజెన్స్ సంస్థలు సమీక్షిస్తాయి. వీటిల్లో వుహాన్ ల్యాబ్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ బిల్లును అనుసరించి మా కార్యవర్గం వీలైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేస్తుంది. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారే సమాచారం మాత్రమే మా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది’’ అని పేర్కొన్నారు.
కరోనా(Covid 19) వైరస్ జన్మస్థానం చైనా(china)లో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికా(USA)కు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో అమెరికాకు చెందిన వివిధ డిపార్ట్మెంట్లు కొవిడ్ పుట్టుకపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా గతంలో నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. కానీ, తాజాగా ఇచ్చిన 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా చైనా వైపే వేలెత్తి చూపింది. తన నెట్వర్క్లోని ల్యాబ్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేసింది. గతంలో అమెరికా దర్యప్తు సంస్థ ఎఫ్బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని అభిప్రాయపడింది. మరోవైపు అమెరికా కాంగ్రెస్లోని రిపబ్లికన్లు కొవిడ్ పుట్టుకపై మరింత సమాచారం తెప్పించేందుకు బైడెన్ కార్యవర్గం మరిన్ని వనరులను మోహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్