America: యుద్ధ లక్ష్యాల్లో రష్యా విఫలం.. ఉక్రెయిన్దే విజయం..!
సైనికచర్య పేరుతో ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. తన యుద్ధ లక్ష్యాలలో విఫలమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల భేటీ
కీవ్: సైనికచర్య పేరుతో ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. తన యుద్ధ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. అంతేకాకుండా సైనిక చర్యను దీటుగా ఎదుక్కొంటున్న ఉక్రెయిన్ మాత్రం ఈ యుద్ధంలో విజయం సాధిస్తోందన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ఉక్రెయిన్కు అమెరికా తోడుగా ఉంటుందన్న ఆయన.. మరింత సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో కలిసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన తర్వాత ఆంటోని బ్లింకెన్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమై రెండు నెలలు పూర్తికాగా, ఈ సమయంలో అమెరికా అగ్రనేతలు ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి.
రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్కు మరింత సహాయాన్ని అందిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 300 మిలియన్ డాలర్ల విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్తోపాటు 165 మిలియన్ డాలర్ల విలువైన మందుగుండు సామగ్రి ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అగ్రనేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రభుత్వానికి, ప్రజలకు తమ పూర్తి మద్దతు లభిస్తుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఈ పర్యటన అవకాశం కల్పించదన్నారు. భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా దూకుడును అడ్డుకుంటూ అసాధారణ ధైర్యంతో ఉక్రెయిన్ సైన్యం ముందుకు వెళ్లడాన్ని ఆంటోని బ్లింకెన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సేనలను ముందుండి నడిపిస్తోన్న నాయకత్వం, సాధిస్తోన్న విజయాలను అమెరికా విదేశాంగమంత్రి కొనియాడారు.
ఇక ఉక్రెయిన్ ప్రతిఘటనను ప్రశంసించిన అమెరికా రక్షణమంత్రి ఆస్టిన్.. ఈ యుద్ధంలో ఆ దేశం తెగువను చూసి యావత్ ప్రపంచం స్ఫూర్తి పొందుతోందన్నారు. ముఖ్యంగా రాజధాని కీవ్ నుంచి రష్యా సైనికులను తిప్పికొట్టడంలో అసాధారణ పోరాట పటిమ కనబరచినట్లు పేర్కొన్నారు.
రష్యా సైనిక చర్యతో కీవ్ నుంచి రాయబార కార్యాలయాన్ని పొలండ్కు తరలించిన అమెరికా.. తిరిగి తమ దౌత్యవేత్తలను కీవ్కు తరలించే ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత పశ్చిమ ఉక్రెయిన్లోని లివివ్లో మొదలుపెట్టి ఇతర నగరాల్లో తమ దౌత్యవేత్తలు రోజూవారీగా పర్యటిస్తారని చెప్పారు. అనంతరం పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ రాజధానికి తిరిగి చేరుకునేలా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా పేర్కొంది.
ఇదిలాఉంటే, రక్షణ పరికరాల రూపంలో ఉక్రెయిన్కు మరింత సాయం అందించేందుకు బ్రిటన్ కూడా ముందుకొచ్చింది. డ్రోన్లు, సురక్షితంగా సైనికుల కదలికలకు ఉపయోగపడే వాహనాలను సమకూరుస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. ఉక్రెయిన్కు సంఘీభావంగా త్వరలోనే కీవ్లో తమ దౌత్య కార్యాలయాన్ని కూడా తెరుస్తామన్న బోరిస్.. ఉక్రెయిన్లో ఆకృత్యాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..