Boris Johnson: ‘మొసలి’ వంటి పుతిన్తో చర్చలు జరపడమంటే కష్టమే!
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలుకుతుందని చెప్పలేమని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ - రష్యా చర్చలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు దొరుకుతుందని చెప్పలేమని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడితో చర్చలు జరపడమంటే మొసలితో సంప్రదింపులు జరిపినట్లేనని బోరిస్ అభిప్రాయపడ్డారు. భారత పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో అక్కడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతోన్న శాంతి చర్చల పురోగతిపై ఈ విధంగా స్పందించారు.
‘ఉక్రెయిన్ను చుట్టిముట్టి స్వాధీనం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నట్లు ఆయన వ్యూహాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో చిత్తశుద్ధి లేనప్పుడు పుతిన్తో ప్రస్తుతం చర్చలు జరపడం ఉక్రెయిన్కు కష్టమే. మీ కాలు మొసలి (పుతిన్ను పోల్చుతూ) దవడలో చిక్కుకుపోయినప్పుడు దానితో చర్చలు ఎలా జరుపుతారు? అంటూ బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడం అత్యంత అవసరమని అన్నారు. అందుకే ఉక్రెయిన్కు బ్రిటన్తోపాటు మిగత నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేసే ప్రణాళికను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ రష్యాకు చిత్తశుద్ధి లేనందున అవి విఫలమవుతూనే ఉన్నాయని బ్రిటన్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కీవ్ను వశం చేసుకోవడంలో ఇప్పటికే ఒకసారి విఫలమైన రష్యా.. రాజధానిపై మరోసారి మెరుపుదాడి చేసే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో తూర్పు ఉక్రెయిన్పై రష్యా దళాలు దాడులను మరోసారి ముమ్మరం చేసినందున ఉక్రెయిన్కు అండగా నిలవడంలో భాగంగా అమెరికాతోపాటు ఇతర దేశాధినేతలు ఈ వారంలో మరోసారి చర్చించేందుకు అంగీకరించారని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ అంశాన్నీ ప్రధాని మోదీతో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత