Pakistan: మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తాం.. పాక్ ప్రధాని హామీ
దివాలా అంచున ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అక్కడి అభివృద్ధి పనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్ (Pakistan) ఇప్పుడు మాల్దీవులకు సాయం చేస్తామంటూ ప్రకటించింది. గురువారం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, పాక్ ప్రధాని అన్వర్ ఉల్హక్ కాకర్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రాధాన్యాలు, అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాలను చర్చించుకున్నారు. మాల్దీవుల అభివృద్ధికి అవసరమైన సాయం తాము అందిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారు. 1966లో తొలిసారి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. మరో వైపు ఇస్లామాబాద్-బీజింగ్ మధ్య బలమైన అనుబంధం ఉంది.
పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు
తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ ఇటీవలే 2 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని డ్రాగన్ను కోరింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాని అన్వర్ చైనా ప్రీమియర్ లి క్వియాంగ్కు లేఖ రాశారు. పాకిస్థాన్ వృద్ధిరేటు పెరుగుదల అంచనాల్లో ఐఎంఎఫ్ 2 శాతం కోత విధించింది. ఇక పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ను విక్రయించి కొంత ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
బడ్జెట్లో కోత..
తాజాగా భారత తాత్కాలిక బడ్జెట్లో మాల్దీవులకు ఏటా కేటాయించే సాయంలో కోత విధించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.600 కోట్లు మంజూరు చేశారు. 2023-24లో ఇది రూ.770.90 కోట్లుగా ఉంది. తొలుత దీనిని రూ.400 కోట్లకే పరిమితం చేయగా.. తర్వాత పునఃసమీక్షించి పెంచారు. ఇక 2022-23లో రూ.183 కోట్లు మాత్రమే ఇచ్చారు. కొన్నేళ్లగా భారత్ ఆ దేశానికి అత్యధిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా రక్షణ, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనలో న్యూదిల్లీ సహకారం అందిస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో తాజాగా సాయంలో కోత పడింది.
భారత్ ఒక్క మాల్దీవులకే కాదు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్లకు అభివృద్ధి సాయాన్ని ఇచ్చింది. ఈ సారి బడ్జెట్లో ఇందుకోసం రూ.2,068 కోట్లు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM