Isarel- Hamas: ఇజ్రాయెల్పై దాడి.. బ్రిటన్లో సంబరాలు చేసుకున్న హమాస్ మద్దతుదారులు
ఇజ్రాయెల్పై హమాస్ దాడికి మద్దతుగా కొందరు లండన్లో సంబరాలు చేసుకున్నారు. ఈ చర్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.
లండన్: ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. భారత్ సహా బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు తెలిపాయి. మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్లో సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. హమాస్ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్ వీధుల్లో సంబరాలు చేసుకుంటూ కనిపించారు. దీనిపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందించారు.
‘‘ఇజ్రాయెల్పై హమాస్ దాడికి మద్దతుగా కొందరు లండన్ వీధుల్లో సంబరాలు చేసుకుంటున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయొచ్చు. లండన్ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించం. అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసు గస్తీని పెంచాం’’ అని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వీడియోలు చూసిన నెటజన్లు హమాస్ మద్దతుదారుల తీరుపై మండిపడుతున్నారు. ‘‘ఇజ్రాయెల్లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారు. అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన వారికి మద్దతుగా లండన్లో సంబరాలు చేసుకుంటున్నారు. యూరప్లో చాలా మంది యూదులపై మాత్రమే దాడి జరుగుతుందనుకుంటున్నారు. హమాస్ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వం’’ అని ట్వీట్లు చేస్తున్నారు.
ఇజ్రాయెల్పై మరోవైపు నుంచి హెజ్బొల్లా దాడులు ప్రారంభం..!
ఇజ్రాయెల్కు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్కు మధ్య జరుగుతున్న భీకర పోరులో మృతుల సంఖ్య పెరిగిన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్లో మృతుల సంఖ్య 300 దాటగా.. 1500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హమాస్ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?