New Zealand: పొగాకు అమ్మకాల నిషేధంపై వెనక్కి.. విమర్శలపాలవుతున్న న్యూజిలాండ్ కొత్త ప్రధాని నిర్ణయం
గతంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని న్యూజిలాండ్ కొత్త ప్రధాని నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ (New Zealand)లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్రిస్టోఫర్ లుక్సన్ (Christopher Luxon) తెలిపారు. ఆయన నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తప్పుపడుతున్నారు. సోమవారం న్యూజిలాండ్ 42వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే తన మొదటి ప్రాధాన్యతని తెలిపారు.
ఈ క్రమంలోనే పొగాకు ఉత్పత్తులపై గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. గతంలో న్యూజిలాండ్ను పొగాకు రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని జెస్సిండా ఆర్డెర్న్.. ‘జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్’ పేరుతో 2008 తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడంపై నిషేధం విధించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలు, ధూమపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాదులు స్వాగతించారు.
ఈ నిషేధాన్ని కొత్త ప్రధాని క్రిష్టోఫర్ తొలగించనున్నారు. ‘‘పొగాకు ఉత్పత్తులపై నిషేధం వల్ల దేశంలో బ్లాక్ మార్కెట్ విస్తరించే ప్రమాదం ఉంది. జనరేషన్ స్మోకింగ్ బ్యాన్లోని అంశాలతో నేను ఏకీభవించను. గత 30 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ధూమపానం చేసే వారి సంఖ్య తగ్గింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం తొలగించినా.. ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంపై ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పొగాకు పరిశ్రమల విజయమని, దేశానికి అవమానమని మండిపడుతున్నారు. బ్రిటన్ కూడా తమ దేశాన్ని 2030 నాటికి పొగ రహితంగా మార్చేందుకు.. భవిష్యత్తు తరాలు సిగరెట్లు వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
న్యూయార్క్లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు
ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) రాజీనామా చేశారు. అనంతరం క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో పది నెలల తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో న్యూజిలాండ్ 42వ ప్రధానిగా రెండు చిన్నపార్టీల మద్దతుతో నేషనల్ పార్టీ అభ్యర్థి క్రిస్టోఫర్ లుక్సన్ ప్రమాణస్వీకారం చేశారు. పన్ను రాయితీ, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 100 రోజుల ప్రణాళిక, రెండేళ్లలో 500 మంది పోలీసుల నియామకం వంటి హామీలతో క్రిస్టోఫర్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన పొగాకు ఉత్పత్తులపై ఉన్న నిషేధం తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!