Earthquake: ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం.. 14 మంది మృతి!

ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా.. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Published : 19 Mar 2023 08:01 IST

క్విటో: ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృత్యువాతపడ్డారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని