మీ సాయం ప్రపంచ భద్రతకు పెట్టుబడి
ఉక్రెయిన్కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు విరాళం కాదని.. అది ప్రపంచ భద్రతకు పెట్టుబడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
యుద్ధం అంతానికి రాజీ పడేది లేదు
అమెరికా కాంగ్రెస్లో జెలెన్స్కీ
వాషింగ్టన్: ఉక్రెయిన్కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు విరాళం కాదని.. అది ప్రపంచ భద్రతకు పెట్టుబడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం కాంగ్రెస్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఉక్రెయిన్ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఎటువంటి రాజీ పడేది లేదు. మా దేశం ఎప్పటికీ లొంగిపోదు. యుద్ధ పర్యవసానాలు మా దేశ విధిరాత కంటే తీవ్రమైనవి. అవి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్ సహకరించారు. ఆయనకు, అమెరికా నేతలు, పౌరులకు కృతజ్ఞతలు’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ఒంటరిది కాదు: బైడెన్
రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. ఉక్రెయిన్కు అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ఎప్పటికీ ఒంటరిది కాదని పేర్కొన్నారు. రెండు బిలియన్ డాలర్ల సరికొత్త ప్యాకేజీని ధ్రువీకరించారు. జెలెన్స్కీ తన పర్యటనలో భాగంగా శ్వేతసౌధంలో బైడెన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. మిత్రపక్షాలను కలిపి ఉంచడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంత మంది మిత్రులు యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన, ఆహార కొరత కారణంగా ఇబ్బందికి గురవుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.