ఎయిర్ఫోర్స్ వన్ వదిలేసి.. 10 గంటలు రైల్లో ప్రయాణించి..
యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్ మీదుగా ఉక్రెయిన్కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే.
బైడెన్ ఉక్రెయిన్ పర్యటన ఆద్యంతం రహస్యం
సి-32 విమానంలో ప్రయాణం
వాషింగ్టన్: యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్ మీదుగా ఉక్రెయిన్కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అమెరికా బలగాలే లేని యుద్ధక్షేత్రానికి అధ్యక్షుడు వెళ్లడం ఆధునిక చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఒకరిద్దరు అధ్యక్షులు వేరే దేశాల్లో ఇలాంటి ప్రాంతాలకు వెళ్లినా అక్కడ ఆ సమయంలో అగ్రరాజ్యం బలగాలు ఉండేవి. అమెరికా అధ్యక్షుడి హోదాలో 2006లో జార్జ్ బుష్ బాగ్దాద్లో పర్యటించారు. 2014లో బరాక్ ఒబామా అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ప్రత్యక్షమయ్యారు. 2019లో డొనాల్డ్ ట్రంప్ అఫ్గానిస్థాన్లో బాగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులతో కలిసి సంబరాలు చేసుకొన్నారు.
చివరి క్షణంలో రష్యాకు సమాచారం
ఉక్రెయిన్కు సంఘీభావం ప్రకటించడానికి బైడెన్ వెళ్లి 23 గంటల్లో తిరిగి స్వదేశానికి చేరుకోవడం కొంత ప్రమాదంతో కూడుకున్న పర్యటనగానే చెబుతున్నారు. ఆయన పర్యటనలో ఉన్న సమయంలో దాడులు జరగకుండా ఉండేందుకు, అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణకు తావు లేకుండా చూసేందుకు రష్యాకు కొద్ది గంటల ముందు సమాచారం ఇచ్చారు. వారాంతపు పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాసమేతంగా వెళ్లిన బైడెన్ ఆ తర్వాత 36 గంటలపాటు బయట ప్రపంచానికి కనిపించలేదు. ఎప్పుడూ ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి బదులు సి-32లో ఉక్రెయిన్కు బయల్దేరిన విషయం ఒకరోజు తర్వాత ధ్రువపడింది. దీనిలో అతి తక్కువమంది భద్రత సిబ్బంది, అధికారులు, వైద్యులు ఉన్నారు. సాధారణంగా ఈ తరహా విమానాలను అమెరికా పరిధిలో చిన్నచిన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడుతుంటారు. అధ్యక్షుడు ఎక్కడకు వెళ్లినా ఆ విశేషాలను ప్రపంచానికి అందించడానికి 13 మంది పాత్రికేయుల్ని తీసుకువెళ్తారు. ఉక్రెయిన్ పర్యటనలో ఇద్దరే ఉన్నారు. వారివద్ద నుంచి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రతాధికారులు ముందుగానే స్వాధీనపరచుకుని స్విచాఫ్ చేశారు.
లోహ విహంగం కిటికీల మూసివేత
ఇంధనం కోసం ఈ విమానం తొలుత జర్మనీలోని రామ్స్టెయిన్లో అమెరికా సైనిక స్థావరానికి చేరుకొంది. అక్కడ విమానం కిటికీలను పూర్తిగా మూసి ఉంచారు. అక్కడి నుంచి పోలండ్లోని జెసియోనాక్ విమానాశ్రయంలో గంట తర్వాత ఈ లోహ విహంగం దిగింది. ఆ ప్రయాణంలో విమానం ట్రాన్స్పాండర్ను కూడా ఆఫ్లో ఉంచారు. ఆ తర్వాత రైలులో 10 గంటలు ప్రయాణించి బైడెన్ కీవ్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ నగరంలో పర్యటనకూ లిమోసీన్ కారుకు బదులు తెల్లరంగు ఎస్యూవీని వాడారు. ఉక్రెయిన్ తరఫున పోరాటంలో అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించేందుకు బైడెన్ వెళ్తున్న చిత్రం బయటకు వచ్చాక ఆయన పర్యటన గురించి ప్రపంచానికి తెలిసింది. బైడెన్ అక్కడున్న సమయంలో అమెరికా విమానాలు కీవ్ గగనతలంపై నిఘా ఉంచాయి.
మాకు చెప్పారు.. మేం హామీ ఇవ్వలేదు
బైడెన్ ఆకస్మిక పర్యటన గురించి దౌత్యమార్గాల ద్వారా తమకు సమాచారం పంపించారనీ, ఆయన భద్రతకు ఎలాంటి హామీని తామివ్వలేదని రష్యా ‘ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్’ డైరెక్టర్ అలెగ్జాండర్ బొర్ట్నికోవ్ మంగళవారం స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత