US-Financial crisis: దివాలా అంచున అమెరికా!
అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి.
డెమోక్రాట్లు, రిపబ్లికన్ల వైరం ఫలితం
ప్రభుత్వానికి డబ్బుల కటకట
అప్పు పరిమితి పెంపునకు రిపబ్లికన్ల ససేమిరా
ప్రమాదంలో 80 లక్షల కొలువులు, డాలర్ ఆధిపత్యం
అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ (పార్లమెంటు) ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది. ఏకంగా అధ్యక్షుడు బైడెన్ కీలక ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏమిటీ అప్పులు?
ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఇందుకోసం ప్రధానంగా బాండ్లు విడుదల చేస్తాయి. నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించడమేగాకుండా.. అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తాయి. అమెరికా అదే చేస్తోంది. అయితే ఏ దేశానికైనా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకోకుండా నియంత్రణ ఉండటం సహజం. వందేళ్ల కిందటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులను కాంగ్రెస్ నియంత్రించింది. వీటిపై పరిమితి విధించింది. అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు. ప్రతిసారీ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియే ఇది. కానీ అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి పీటముడి బిగుసుకుని ఆర్థిక మంత్రే చేతులెత్తేసే స్థితికి చేరుకుంది.
జీడీపీ కంటే 29% ఎక్కువగా..
2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా సుమారు 7 ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. జపాన్, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని, భవిష్యత్ ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు. బైడెన్తో రిపబ్లికన్ల చర్చలు సాగుతున్నా కొలిక్కి రావడం లేదు.
జూన్ ఒకటిలోపు ఏ క్షణమైనా..
మరోవైపు అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ ఇప్పటికే చేతులెత్తేశారు. పరిమితి పెంచకుంటే జూన్ ఒకటోతేదీ లోపు ఏ క్షణమైనా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు. అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు, పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు.
అంతర్జాతీయంగా ప్రభావం..
అమెరికా చరిత్రలో ప్రభుత్వం చెల్లింపులు జరపలేని పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు. వస్తే ఇదే తొలిసారి అవుతుంది. అదే జరిగితే అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయి. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సైన్యానికి జీత భత్యాలు ఆగిపోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులపై ఆధారపడే అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రుణాలు, క్రెడిట్ కార్డులపై అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి... చివరికది భారీ నిరుద్యోగంతో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ‘అమెరికా తాత్కాలికంగా స్వల్పకాలానికి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తినా 80 లక్షల ఉద్యోగాలు పోతాయి. స్టాక్ మార్కెట్ 45శాతం కుప్పకూలుతుంది’ అని శ్వేతసౌధ వర్గాలు ఆందోళన వ్యక్తంజేయడం గమనార్హం. అన్నింటికీ మించి అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలుతుంది. ప్రపంచ ఆర్థిక రంగానికి ఇరుసుగా నడుస్తున్న డాలర్ ప్రాబల్యం ప్రమాదంలో పడుతుంది. చైనా కరెన్సీలాంటివి ప్రత్యామ్నాయాలుగా ఎదిగే అవకాశం ఉంది. అమెరికా ఆర్థికంగా బిల్లులు చెల్లించలేని తేదీ ఎప్పుడనేది ఇప్పుడందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎవరూ దీనిని కచ్చితంగా చెప్పలేరు. రుణ పరిమితి పెంచకుంటే బహుశా జూన్ 1 నుంచి ఆగస్టు 1లోపు ఈ అత్యయిక పరిస్థితి తలెత్తవచ్చనుకుంటున్నారు.
రుణ పరిమితిని కాంగ్రెస్ పెంచకుంటే.. అమెరికా మాంద్యాన్ని చవిచూస్తుంది. ఆ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచంలో అమెరికా నాయకత్వం ప్ర£మాదంలో పడుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది
అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ