భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు
భారత్ సరిహద్దుల సమీపంలోని ఆక్రమిత అక్సాయ్చిన్లో చైనా సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతోందని బ్రిటన్కు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ చాటమ్హౌస్ (రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్) పేర్కొంది.
సైనిక మోహరింపులకు వీలుగా ఏర్పాట్లు
బ్రిటన్ సంస్థ నివేదిక
ఇంటర్నెట్డెస్క్: భారత్ సరిహద్దుల సమీపంలోని ఆక్రమిత అక్సాయ్చిన్లో చైనా సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతోందని బ్రిటన్కు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ చాటమ్హౌస్ (రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్) పేర్కొంది. సైనికుల మోహరింపునకు వీలుగా ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. రోడ్ల విస్తరణ, అవుట్పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. అక్టోబరు 2022 నుంచి ఆరు నెలలపాటు ఉపగ్రహ చిత్రాలు, 2020లో ఘర్షణ తర్వాత భారీ నిర్మాణాలకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది.అక్సాయ్చిన్లో శాటిలైట్ చిత్రాల్లో.. విస్తరించిన రోడ్లు, అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే అత్యాధునిక శిబిరాలు, పార్కింగ్ ప్రాంతాలు, సౌర ఫలకాలు, హెలిప్యాడ్లు ఉన్నట్లు చాటమ్హౌస్ తన నివేదికలో వెల్లడించింది. వివాదాస్పద ప్రదేశంలో సరికొత్త హెలిపోర్టు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో డ్రోన్లు, హెలికాప్టర్లు మోహరించడానికి వీలుగా 18 హ్యాంగర్లు, చిన్నపాటి రన్వేను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా అక్సాయ్చిన్ చుట్టుపక్కల చైనా సైన్యం ఉద్ధృతంగా కార్యకలాపాలు సాగించేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది.
2020లో సైనిక ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి క్షీణించాయి. దీంతోపాటు గల్వాన్ లోయ సమీపంలోని చైనా సైనిక స్థావరాలను రోడ్లతో అనుసంధానం చేశారు. దీంతో ఇక్కడి నుంచి గడ్డకట్టిన నది మీదుగా గతంలో ఘర్షణ జరిగిన ప్రదేశాన్ని వీక్షించే పరిస్థితి నెలకొన్నట్లు చాటమ్హౌస్ నివేదికలో వెల్లడించింది. మరోవైపు దెప్సాంగ్ మైదానాలు వంటి చోట్ల కూడా చైనా దళాల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఒక దెప్సాంగ్కు దక్షిణంపైపు ఉన్న ‘రకి నాలా’ వద్ద భారత దళాల గస్తీని అడ్డుకొనే స్థితిలో చైనా సైన్యం ఉన్నట్లు వెల్లడించింది. దీంతోపాటు పలు అంశాలను విశ్లేషించింది. ఆక్సాయ్చిన్ భారత భూభాగం. చైనా దీన్ని ఆక్రమించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ