Canada: కెనడాలో ఎందుకు ‘సింగ్ ఈజ్ కింగ్’!
భారత్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సిక్కులున్న దేశం కెనడా. తాజా జనగణన ప్రకారం కెనడాలో సిక్కు జనాభా దాదాపు 8 లక్షలకు చేరింది.
వరస మారిన వలస పక్షులు
తరచూ ఖలిస్థాన్వాదం
అక్కడి ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయం
ఈనాడు ప్రత్యేక విభాగం
‘‘ఇందిరాగాంధీ హత్యను ఉత్సవంగా నిర్వహించటానికి అనుమతినివ్వటం ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుంది’’.. కెనడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్వరంతో చేసిన తాజా హెచ్చరిక ఇది. ఈమధ్య పదేపదే భారత్, కెనడా మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతునే ఉన్నాయి. దాదాపు అన్నింటికీ మూలం అతివాద సిక్కు ఖలిస్థాన్ వాదంలో ఉంది. కెనడా ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఎందుకని కెనడాలోనే ప్రత్యేకంగా ఈ ఖలిస్థాన్ గళం ఎక్కువగా వినిపిస్తుంది? కెనడా ప్రభుత్వం వాటిని ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది?
..అలా మొదలైంది
భారత్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సిక్కులున్న దేశం కెనడా. తాజా జనగణన ప్రకారం కెనడాలో సిక్కు జనాభా దాదాపు 8 లక్షలకు చేరింది. ఇది ఆ దేశ జనాభాలో 2శాతానికి పైనే! 8లక్షల మందిలో 30శాతంపైగా అక్కడే పుట్టినవారు. 4.5 లక్షల మంది శాశ్వత నివాస హోదా పొందినవారు. కెనడాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదే కాకుండా, నాలుగో పెద్ద మతం సిక్కిజం. సుదూరమైన కెనడాలో సిక్కిజం ఇంతగా పెరగటానికి కారణాలు... బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాయి. ఆంగ్లేయుల పాలనలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో చాలామంది పంజాబీలుండేవారు. వారిలో కొందరిని విక్టోరియా మహారాణి డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వాంకోవర్కు పంపించింది. తిరిగి భారత్కు వచ్చిన సైనికులు కెనడాలో అవకాశాల గురించి ప్రచారం చేయటంతో పంజాబ్ గ్రామాల నుంచి అనేకమంది అక్కడకు వెళ్లి, వ్యవసాయం, అటవీ రంగాల్లో పనిచేసేవారు. మొట్టమొదటగా రిసాలదార్ మేజర్ కేసర్ సింగ్ 1897లో కెనడాలో స్థిరపడ్డారు. చాలామంది సిక్కులు కెనడా సైన్యంలోనూ కుదిరారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో కెనడా తరఫున వారు బరిలో నిలిచారు. 1906నాటికి సుమారు 1500 మంది పంజాబీలు కెనడాలో ఉన్నారు. క్రమంగా వారిసంఖ్య విస్తరించింది. గురుద్వారాలు కట్టుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునేందుకు చట్టపరంగా పోరాడి అనుమతులు సాధించారు. నివాస హక్కు సంపాదించారు. 1960 తర్వాత నిపుణులైన సిక్కుల రాక పెరిగింది. కెనడా నుంచి అమెరికాకు కూడా విస్తరించారు.
రాజకీయ ప్రవేశం
2000 తర్వాత కెనడాలో సిక్కుల జనాభా గణనీయంగా పెరిగింది. 2006-2016 మధ్యకాలంలో పంజాబీ మాట్లాడే సిక్కుల సంఖ్య కెనడాలో 36.5% పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో, కెనడా పాలన రంగంలో కూడా వారి ప్రాబల్యం ఎక్కువైంది. జనాభా పెరగటంతో దేశ రాజకీయాలనూ ప్రభావితం చేయటం మొదలైంది. కెనడా రాజకీయాల్లోని పే-టు-ప్లే పద్ధతి వారికి అనుకూలంగా మారింది. ఈ పద్ధతిలో ప్రతి ఓటరు తాను మద్దతిచ్చే అభ్యర్థికి అనుకూలంగా ఓ దరఖాస్తుపై సంతకం చేసి, కొంత సభ్యత్వ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు పరిమితమైన ఇది... క్రమంగా మత శాఖలకు విస్తరించింది. అదే సిక్కు మతస్థులకు కలసి వచ్చింది.
ఎంపీల్లో 18 మంది సిక్కులు
ప్రస్తుతం కెనడా హౌస్ ఆఫ్ కామన్స్లో 18 మంది ఎంపీలు సిక్కులు. ఎనిమిది ఫెడరల్ సీట్లలో సిక్కులు బలంగా ఉన్నారు. మరో 15 సీట్లను ప్రభావితం చేస్తారు.
* గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ- అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించలేదు. న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్సింగ్ మద్దతివ్వటంతో ఆయన ప్రధాని అయ్యారు. అలా సిక్కునేత కెనడా కింగ్ మేకర్ అయ్యారు.
* అంతర్జాతీయంగా సిక్కు ఉద్యమాల ప్రభావం ఇక్కడివారిపైనా పడింది. ముఖ్యంగా ఖలిస్థాన్ ఉద్యమ ప్రభావం. కెనడా ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం దేశంలో ఖలిస్థాన్వాదులను అత్యంత ప్రమాదకర ఉగ్రవాద గ్రూపుల్లో ఒకరుగా హెచ్చరించాయి. అయినా, రాజకీయాల్లో సిక్కు మతస్థుల ప్రాధాన్యం తెలిసిన కెనడా రాజకీయ పార్టీలు ఖలిస్థాన్ వాదం పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత కెనడా రక్షణ మంత్రిగా ఉన్న హర్జీత్సింగ్- ఖలిస్థాన్ మద్దతుదారనే విమర్శ ఉంది. 8 లక్షల మంది సిక్కుల్లో చాలా తక్కువమంది మాత్రమే ఖలిస్థాన్కు మద్దతిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్