ప్రపంచ బాహుబలి.. భారత్
‘‘ప్రపంచ చరిత్రలో భారత్ బాహుబలిలాంటిది. భవిష్యత్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోంది’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రశంసించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసలు
ఘనంగా బాస్టీల్ దినోత్సవం
గౌరవ అతిథిగా హాజరైన ప్రధాని మోదీ
పారిస్: ‘‘ప్రపంచ చరిత్రలో భారత్ బాహుబలిలాంటిది. భవిష్యత్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోంది’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రశంసించారు. మానవ జాతి చరిత్ర గతిని మార్చిన పద్దెనిమిదో శతాబ్ది ఫ్రెంచ్ విప్లవ ప్రతీకగా ప్రతి ఏటా జులై 14న జరిగే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఈసారి భారతీయతను సంతరించుకుంది. శుక్రవారం పారిస్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా పేరుగాంచిన బాస్టీల్ డే పరేడ్లో భారత సైనికులూ పాల్గొన్నారు. సారే జహాసె అచ్చా అంటూ... వీనులవిందుగా వాయిద్యం హోరెత్తుతుంటే... 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బృందం ఫ్రెంచ్ సైనిక దళాలతో కలిసి కవాతు చేసింది. ఫ్రాన్స్ వాయుసేనతో కలిసి భారత్కు చెందిన రఫేల్ విమానాలూ ఝుమ్మంటూ వేడుకకు ఆకాశంలో రంగులద్దాయి. భారత సైనిక బృందం పరేడ్కు రాగానే మోదీ లేచి నిల్చొని సెల్యూట్ చేశారు.
మన బంధం మరింత బలపడాలి
వైభవంగా జరిగిన వేడుకలపై మోదీ ఉద్వేగంగా స్పందించారు. ‘‘ఈ చరిత్రాత్మక బాస్టీల్ డే వేడుకలో అద్భుత అతిథ్యమిచ్చినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. మాకు నమ్మకమైన, బలమైన భాగస్వామిగా ఉంటూ వస్తున్న ఫ్రాన్స్కు 140 కోట్ల మంది భారతీయులు సదా కృతజ్ఞులై ఉంటారు. ఈ బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా ఇందుకు ప్రతిస్పందించారు. ‘‘ప్రపంచ చరిత్రలో బాహుబలిలాంటి భారతావని భవిష్యత్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మాకు వ్యూహాత్మక భాగస్వామేకాకుండా మంచి మిత్ర దేశం కూడా. మా జాతీయ దినోత్సవానికి భారత్ను గౌరవ అతిథిగా ఆహ్వానించటాన్ని గర్వంగా భావిస్తున్నాం. మా వాయుసేనతో కలిసి భారత రఫేల్ విమానాలు ఆకాశంలో విహరిస్తుంటే... తొలి ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్, భారత సైనికుల పోరాటం గుర్తుకొస్తోంది. వాటిని ఎన్నడూ మరచిపోలేం’’ అని మెక్రాన్ అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున బరిలోకి దిగిన భారత సైనికులు ఐరోపా, ఆఫ్రికాల్లో ఫ్రాన్స్కు ఎన్నో విజయాలు అందించారు.
సంయుక్తంగా యుద్ధ విమానాల ఇంజిన్ల అభివృద్ధి
రక్షణ ఉత్పత్తుల రంగంలో తమ సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని భారత్-ఫ్రాన్స్లు నిర్ణయించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత నౌకా దళం కోసం మూడు స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టులపై అవగాహనకు వచ్చాయి. ప్రధాని మోదీ, మెక్రాన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం అధ్యక్ష భవనం వద్ద నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే, నౌకా దళానికి అవసరమైన 26 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయనుందనే విషయమై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఘనమైన లక్ష్యాలతో భారత్-ఫ్రాన్స్ మధ్య రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన వ్యూహాత్మక బంధానికి మార్గసూచీని సిద్ధం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ‘‘భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. మరో 25 ఏళ్ళకు మార్గసూచీ తయారు చేస్తున్నాం. ఫ్రాన్స్తో బంధంలో రక్షణ సహకారం ప్రధానమైంది. ఇరుదేశాల పరస్పర నమ్మకానికి ఇది ప్రతీక. భారత్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల్లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి. ఉగ్రవాదంపై పోరులోనూ సమష్టిగా నడుస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హెలికాప్టర్ ఇంజిన్లు, విడిభాగాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల సదుపాయాలను ఫ్రెంచ్ కంపెనీలు భారత్లోనే ఏర్పాటు చేసేలా చర్చలు సాగుతున్నాయని మోదీ తెలిపారు. రెండు దేశాల చమురు కంపెనీలైన ఐఓసీ-టోటల్ మధ్య కూడా దీర్ఘకాల ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో సహకారంపైనా మంతనాలు కొనసాగుతున్నాయి. రక్షణ రంగానికి చెందిన ఇరుదేశాల పరిశోధన సంస్థల మధ్య సహకారానికి సంబంధించి కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్యారిస్లోని భారత దౌత్య కార్యాలయంలో డీఆర్డీఓ టెక్నికల్ ఆఫీస్ను భారత్ ఏర్పాటు చేయనుంది.
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో ఫ్రాన్స్ సత్కరించింది. ఆ దేశ అత్యున్నత పౌర, మిలిటరీ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ ను ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ గురువారం రాత్రి ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు మోదీయే! రెండు రోజుల పర్యటన కోసం గురువారం పారిస్ చేరుకున్న ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతులు ప్రత్యేక అతిథ్యమిచ్చారు.
99 ఏళ్ల ఫ్రెంచ్ యోగ గురువుకు ప్రశంసలు
ప్రాచీన భారతీయ యోగను దాదాపు 50 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రాన్స్కు చెందిన మహిళ షరలోట్ షాపిన్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. త్వరలో ఆమె వయసు 100 ఏళ్లకు చేరువకాబోతోందని, అయినప్పటికీ యోగా గురువుగా విశిష్ట సేవలు అందిస్తున్నారని కితాబునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ వాంగ్మూలం ఇచ్చారు. -
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
బ్రిటన్లో ఓ లెక్కల టీచర్ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు. -
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. -
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. -
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ