ప్రతిభావంతులకే ఇక బ్రిటన్లో ప్రవేశం
బ్రిటన్లో ఇకపై ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
38,700 పౌండ్ల వార్షిక జీతభత్యాలు పొందగలిగేవారికే అవకాశం
అమల్లోకి నూతన నిబంధనలు
లండన్: బ్రిటన్లో ఇకపై ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గతంలో 26,200 పౌండ్ల వరకు వార్షిక వేతనం చెల్లించే ఉద్యోగాలు చేయడానికి విదేశీయులకు నైపుణ్య ఉద్యోగ వీసాలు ఇచ్చేవారు. గురువారం ఈ వేతన పరిమితిని 48 శాతం అంటే 38,700 పౌండ్లకు పెంచారు. దీనివల్ల అధిక జీతభత్యాలు చెల్లించే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మాత్రమే విదేశీ సిబ్బంది దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కొత్త నిబంధన భారతీయులకు ప్రతికూలంగా ఉండబోతున్నది. బ్రిటన్లోని వైద్య సిబ్బంది, టెక్ నిపుణులు, విద్యార్థులలో భారతీయులు ఎక్కువే. కంపెనీలు బ్రిటిష్ పౌరులను కాదని చౌకగా విదేశీయులను నియమించుకోకుండా చూడటమే కొత్త ఉత్తర్వుల లక్ష్యం. గతేడాది బ్రిటన్లో నైపుణ్య వీసా పొందిన 3 లక్షలమంది ఈ ఏడాది కొత్త నిబంధన వల్ల అనర్హులైపోతారు. చౌకగా లభించే విదేశీ సిబ్బంది వల్ల బ్రిటిష్ పౌరుల జీతభత్యాలు కోసుకుపోతున్నాయని, దీన్ని నివారించడానికే కొత్త నిబంధన తెచ్చామని బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ వివరించారు. ఇక నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులకే నైపుణ్య వీసాలిస్తామని చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం చేస్తున్న మార్పులు ఇప్పటికే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2022 సెప్టెంబరులో భారతీయులకు 20,360 నైపుణ్య సిబ్బంది వీసాలు లభించగా 2023లో అవి 18,107కు తగ్గాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే వీసాలూ తగ్గిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు