USA: వృద్ధ జంట లెక్క అదిరింది.. లాటరీలో లొసుగులను వాడుకొని రూ.200 కోట్లు..!
అమెరికాలో ఓ వృద్ధ జంట అదృష్టాన్నే తమ గుప్పిట్లో పెట్టుకొంది. ఓ లెక్క ప్రకారం లాటరీ టికెట్లను కొనుగోలు చేసి కోట్లల్లో సంపాదించింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)లో ఓ జంట రిటైర్మెంట్ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా 26 మిలియన్ డాలర్లు (రూ.200 కోట్లు) సంపాదించింది. ఇదేమీ అదృష్టంతో వచ్చిన మొత్తం కాదు.. తమకు వచ్చిన గణిత విద్యను వాడి శ్రమించి సంపాదించిన మొత్తం కావడం విశేషం. మిషిగాన్లోని ఎవర్ట్ ప్రాంతంలో జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహించేవారు. తమకు 60 ఏళ్లు దాటగానే దానిని విక్రయించి విశ్రాంతి జీవితం ప్రారంభించారు.
2003లో విన్ఫాల్ అనే లాటరీ గేమ్ గురించి జెర్రీ తెలుసుకొన్నాడు. గణిత శాస్త్రంపై పట్టున్న అతడు సదరు లాటరీలో కొన్ని లొసుగులను కనిపెట్టాడు. ఒక వ్యూహం ప్రకారం వెళితే కచ్చితంగా సొమ్మును సంపాదించవచ్చని గుర్తించాడు. ఈ జాక్పాట్ సొమ్ము 5 మిలియన్ డాలర్లకు చేరుకొని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుంది. లెక్క ప్రకారం 1,100 డాలర్లను వెచ్చించి.. కొన్ని సంఖ్యలున్న 1,100 టికెట్లు కొనుగోలు చేస్తే కనీసం 1,900 డాలర్లు పొందవచ్చని గ్రహించాడు.
మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేసిన ఈజ్మైట్రిప్
ఆ వృద్ధ జంట తొలుత ప్రయోగాత్మకంగా 3,600 డాలర్లను ఖర్చు చేసి విన్ఫాల్ టికెట్లను కొనుగోలు చేసింది. అప్పుడు 6,300 డాలర్లు సంపాదించింది. ఆ తర్వాత 8,000 డాలర్లతో టికెట్లు కొన్నారు. మరోసారి లాభం రెట్టింపైంది. సంపాదన బాగుండటంతో తర్వాత జీఎస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కొందరు మిత్రులు, సన్నిహితులను సభ్యులుగా చేర్చుకొన్నారు. మసాచుసెట్స్లో విన్ఫాల్ వంటి లాటరీ నిర్వహిస్తే అక్కడకు వెళ్లి భారీ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేశారు.
గత తొమ్మిదేళ్లలో తాము, తమ బృందం కలిపి మొత్తం 26 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు జెర్రీ, మార్జ్ జంట చెప్పింది. తాము ఏకంగా 8 మిలియన్ డాలర్ల మేరకు లాభాలకు ముందే పన్ను చెల్లించినట్లు వెల్లడించింది. లాటరీల ద్వారా వచ్చిన సొమ్ముతో తమ ఇంటిని పునరుద్ధరించుకొన్నామని.. పిల్లలను చదివించుకొన్నట్లు వెల్లడించారు.
పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ఒక దశలో వీరిపై ఇన్స్పెక్టర్ జనరల్ విచారణ చేపట్టారు. కానీ, పూర్తిగా నిబంధనల ప్రకారం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు దానిలో తేలింది. ఇక వీరి జీవితంపై ఒక సినిమా కూడా వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.