Taiwan: మేము క్షేమంగా ఉంటేనే.. ప్రపంచానికి ‘చిప్స్’ సరఫరా..!
తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్ ఆర్థిక మంత్రి వాంగ్ మెయి-హువా పేర్కొన్నారు. మంగళవారం ఆమె అమెరికాలో పర్యటించారు.
ఇంటర్నెట్డెస్క్: తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్ ఆర్థిక మంత్రి వాంగ్ మెయి-హువా పేర్కొన్నారు. మంగళవారం ఆమె అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్స్ సరఫరా పై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఏమాత్రం దుందుడుకుగా వ్యవహరించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సైనిక శక్తితో తమ సెమీకండెక్టర్ సంస్థలను స్వాధీనం చేసుకోలేరన్నారు.
వాంగ్ తన పర్యటనలో భాగంగా ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో మాట్లాడారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకొంటే చైనాపై ఆ ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన చిప్స్ తయారీ కాంట్రాక్టర్ అయిన తైవాన్ సెమీకండక్టర్ మానిఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ)ని సైనిక శక్తితో స్వాధీనం చేసుకుంటే.. అది కార్యకలాపాలను నిలిపివేస్తుందని పేర్కొన్నారు.
‘‘తైవాన్కు ఏమి జరిగినా.. దాని ప్రతికూల ప్రభావం ప్రపంచంపై పడుతుంది’’ అని గతంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలను వాంగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని తాను మరోరకంగా చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘తైవాన్ క్షేమంగా ఉంటే.. ప్రపంచ సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. అమెరికా, దాని మిత్రదేశాలతో కలిసి అత్యంత సమర్థంగా చిప్స్ ఉత్పత్తి చేయడానికి తైవాన్ అత్యంత ఆసక్తిగా ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికా-తైవాన్ సంబంధాలు బలోపేతం చేయడంపై అమెరికా కాంగ్రెస్లోని రెండు వర్గాలు మద్దతునివ్వడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా దేశీయంగా చిప్స్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించడంపై తాము ఆందోళన చెందడంలేదని వాంగ్ పేర్కొన్నారు. తైవాన్లో దాదాపు 40 ఏళ్లుగా నిర్మించుకొంటూ వచ్చిన సెమీకండెక్టర్ పరిశ్రమ చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. తైవాన్ వంటి మరో సరఫరా వ్యవస్థను సృష్టించడంగానీ, భర్తీ చేయడంకానీ చాలా కష్టమని వాంగ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు