Indian Navy: కార్గో నౌకపై హూతీల క్షిపణి దాడి.. భారత నేవీ డేరింగ్ రెస్క్యూ
Indian Navy: గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో క్షిపణి దాడికి గురైన కార్గో నౌకలోని సిబ్బందిని భారత నేవీదళం కాపాడింది. ఇందుకోసం అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
(క్షిపణి దాడికి గురైన నౌక.. అమెరికా విడుదల చేసిన శాటిలైట్ చిత్రం)
ఇంటర్నెట్ డెస్క్: సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని హూతీ (Houthi) తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (gulf of aden)లో ‘ట్రూ కాన్ఫిడెన్స్’ కార్గో నౌక (Cargo ship)పై క్షిపణులతో దాడి (Missile Attack) చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కతా (INS Kolkata) కాపాడింది. క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సాహసోపేతంగా వారిని రక్షించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను నౌకాదళ (Indian Navy) అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘బార్బడోస్ జెండా ఉన్న కార్గో నౌక ‘ట్రూ కాన్ఫిడెన్స్’పై దాడి జరగడంతో అగ్నిప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. నౌక కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ సమాచారమందుకున్న ‘ఐఎన్ఎస్ కోల్కతా’ సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్, బోట్ల సాయంతో ఒక భారతీయుడు సహా 21 మంది సిబ్బందిని కాపాడింది. క్షతగాత్రులకు అత్యవసర ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం సిబ్బందిని జిబౌటీకి తరలించింది’’ అని నేవీ వెల్లడించింది.
కార్గో నౌకపై హూతీల క్షిపణి దాడి.. ముగ్గురు సిబ్బంది మృతి
యెమెన్ నగరం ఎడెన్కు నైరుతి దిశగా 55 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆ నౌక చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు ట్రాకింగ్ డేటాలో ఉంది. దాడి సమయంలో నౌకలో మొత్తం 23 మంది ఉన్నారు. సిబ్బందిలో భారత్కు చెందిన ఒకరు, నలుగురు వియత్నాం, 15 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు కాగా.. మిగతా ముగ్గురు సాయుధ గార్డులు అని నౌక యాజమాన్యం వెల్లడించింది. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మిగతా 21 మందిని నేవీ కాపాడింది. అనంతరం చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న నౌక శాటిలైట్ చిత్రాలను అమెరికా ఆర్మీ విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది. -
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.