Iran: నలుగురు మొసాద్ ఏజెంట్లకు మరణశిక్ష అమలు: ఇరాన్
ఇరాన్ (Iran)లో తాజాగా మొసాద్ గూఢచారులను ఉరితీశారు. ఈ విషయాన్ని ఆ దేశ న్యాయశాఖ వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులకు ఇరాన్ (Iran)లో సోమవారం మరణశిక్ష అమలుచేశారు. వీరు ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన కీలక ప్రదేశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు అక్కడి కోర్టు నిర్ధారించింది. ఇరాన్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్లోని ఓ స్థావరంలో కుట్రకు తెరతీశారన్న ఆరోపణలపై 2022లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారని న్యాయశాఖకు చెందిన వెబ్సైట్ వెల్లడించింది. వీరిని మహమ్మద్ ఫరమార్జి, మొహసీన్ మజ్లమ్, వాఫా అజర్బార్, పిజ్మన్ ఫతేహ్లుగా గుర్తించారు.
‘‘ఇస్ఫాహాన్లో బాంబింగ్ చేయాలని యూదుల గూఢచార సంస్థతో కలిసి కుట్ర పన్నిన నలుగురిని అరెస్టు చేశాం. వారికి సోమవారం ఉదయం మరణశిక్ష విధించాం. వీరిని ఏడాదిన్నర క్రితం మొసాద్ సంస్థ నియమించుకొని ఆఫ్రికా దేశాలకు తరలించింది. అక్కడ సైనిక కేంద్రాల్లో ఇజ్రాయెల్ అధికారుల సమక్షంలో శిక్షణ ఇచ్చింది. 2023 సెప్టెంబర్లోనే ఈ నలుగురికి మరణశిక్ష విధించాం’’ అని ఆ వెబ్సైట్లో ఉంచింది.
గతేడాది ఆగస్టులో తమ బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి మొసాద్ పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఇస్ఫాహాన్లోని తమ సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ డ్రోన్తో దాడి చేసిందని ఆరోపించింది.
‘ఇది భయానక ట్రెండ్’: డీప్ఫేక్లపై సత్యనాదెళ్ల ఆందోళన
బ్రిటన్తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవలే రక్షణశాఖ మాజీ ఉద్యోగి అలీరెజా అక్బరీకి కూడా మరణశిక్ష విధించింది. ఆయన ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత బ్రిటన్కు చెందిన ఎంఐ6 ఏజెంట్గా మారినట్లు ఇరాన్ చెబుతోంది. ఈనేపథ్యంలో అతడిని ఉరి తీసినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇక డిసెంబర్లో కూడా ఒక మొసాద్ ఏజెంట్ను జెహెదాన్లో ఉరి తీసినట్లు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!