Ukraine Crisis: తొలిసారి రష్యా సైనికుడి యుద్ధ నేరాలపై విచారణ..!
మాస్కో దళాలు ఉక్రెయిన్పై దాడి మొదలు పెట్టిన తర్వాత తొలి సారిగా ఓ రష్యా సైనికుడి యుద్ధనేరాలపై విచారణ మొదలుకానుంది. 21ఏళ్ల వాడిమ్ షిషిమారిన్ అనే రష్యా సైనికుడు నిరాయుధుడైన 62 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: మాస్కో దళాలు ఉక్రెయిన్పై దాడి మొదలు పెట్టిన తర్వాత తొలిసారిగా ఓ రష్యా సైనికుడి యుద్ధ నేరాలపై విచారణ మొదలు కానుంది. 21 ఏళ్ల వాడిమ్ షిషిమారిన్ అనే రష్యా సైనికుడు.. నిరాయుధుడైన 62 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకొంది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28న సుమీ ప్రాంతంలోని ఓ గ్రామంలో వాడిమ్ తన కలష్నికోవ్ రైఫిల్తో కారులో నుంచి ఓ వృద్ధుడిపై గురిపెట్టి పలుమార్లు కాల్పులు జరిపాడు. తన ఇంటికి కొద్ది దూరంలో ఆ వృద్ధుడు కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి ఉక్రెయిన్ దర్యాప్తు బృందం అవసరమైన ఆధారాలను సంపాదించింది. ఈ సైనికుడి పాత్ర ఉందని నిర్ధారించి న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. యుద్ధ నిబంధనల ఉల్లంఘన, హత్య వంటి నేరాలు అతడిపై మోపారు. ఈ నేరాలకు 10 నుంచి 15 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. రష్యా సైనికుడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఎటువంటి ఆధారాలను సేకరించిందో మాత్రం బహిర్గతం చేయలేదు.
గాయపడిన వారిని తరలిస్తూ దొరికి పోయి..
ఉక్రెయిన్కు చెందిన వొలొదిమిర్ జోల్కిన్ అనే యూట్యూబర్ మార్చి19న రష్యా సైనికుడు వాడిమ్ షిషిమారిన్ను ఇంటర్వ్యూ చేశాడు. జోల్కిన్ ఉక్రెయిన్ యుద్ధంలో బంధీలుగా మారిన రష్యా సైనికులను నేరుగా ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆ సైనికుల కుటుంబాలతో మాట్లాడిస్తుంటాడు కూడా. వాడిమ్ ఇంటర్వ్యూ సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
జనవరిలో సైనిక విన్యాసాల్లో భాగంగా ఉక్రెయిన్కు 200 మైళ్ల దూరంలోని ఓ నగరానికి తరలించినట్లు చెప్పాడు. ఆ తర్వాత రష్యా యుద్ధం ప్రకటించడంతో వాడిమ్ ఉన్న దళం ఉక్రెయిన్లోకి చొరబడిందని వివరించాడు. చివరికి పోరాటంలో గాయపడిన సహచరులను రష్యా తరలిస్తుండగా.. వారి బృందాన్ని ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టడంతో దొరికిపోయినట్లు పేర్కొన్నాడు. మరోపక్క అసలు యుద్ధానికి వెళుతున్న విషయం వాడిమ్కు తెలియదని అతని తల్లిదండ్రులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ