USA: చైనా, రష్యాల బంధం బలపడితే.. ఏం చేయాలో భారత్ నిర్ణయించుకోగలదు..: బైడెన్
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య విషయంలో భారత్ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచీ స్పందిస్తోంది. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్- భారత ప్రధాని మోదీ వర్చువల్ భేటీ అనంతరం అమెరికా ఈ మేరకు అభిప్రాయపడింది. ఈ భేటీ అనంతరం శ్వేతసౌధంలో
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య విషయంలో భారత్ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచి స్పందిస్తోంది. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్- భారత ప్రధాని మోదీ వర్చువల్ భేటీ అనంతరం అమెరికా స్పందనను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈ భేటీ అనంతరం శ్వేతసౌధంలో విలేకర్లు.. అమెరికా పక్షాన భారత్ ఉంటుందా..? అని ప్రశ్నించారు. దీనికి బైడెన్ మాట్లాడుతూ ‘‘భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఒకవేళ రష్యా-చైనాల బంధం బాగా బలపడినట్లు అనిపిస్తే కచ్చితంగా భారత్ ఆలోచనా విధానంపై అది ప్రభావం చూపిస్తుంది ’’ అని పేర్కొన్నారు.
బుచాలోని నరమేధంను భారత్ తీవ్రంగా ఖండించడాన్ని, వీటిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసిన విషయాన్ని శ్వేతసౌధం మీడియా అధికారులు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో కొంత బలమైన ప్రకటనలు చేయడమే భారత స్వతంత్ర వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. దీంతోపాటు భారత్ నుంచి ఉక్రెయిన్కు మానవీయ సాయం అందుతోందని వెల్లడించారు. అమెరికా నిరంతరం భారత్తో చర్చలు జరుపుతుంటుందని చెప్పారు.
చమురు ఆందోళనలను తిప్పికొట్టిన భారత్..
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై అమెరికా ఆందోళనలను భారత్ కొట్టిపారేసింది. 2+2 చర్చల సందర్భంగా.. భారత మంత్రులు జైశంకర్, రాజ్నాథ్ సింగ్, అమెరికా మంత్రులు ఆంటోని బ్లింకన్, లాయిడ్ ఆస్టిన్లు సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘మీకు చమురు కొనుగోళ్లకు సంబంధించిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశం వస్తే.. మీ దృష్టి ఐరోపాపై ఉండాలి. భారత్ కూడా ఇంధన అవసరాల రీత్యా కొనుగోలు చేస్తుంది. కానీ, అంకెలను పరిశీలిస్తే.. భారత్ నెలరోజుల్లో కొనుగోలు చేసినంత చమురును ఐరోపా ఒక్క సాయంత్రంలో కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణపై మా దేశం చేసిన ప్రకటనలే వైఖరిని వెల్లడిస్తాయి. ఐరాస, భారత పార్లమెంట్, ఇతర వేదికలపై మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా వైఖరి. ఈ లక్ష్య సాధనకు అవసరమైన సహకారాన్ని అన్ని రకాలుగా అందజేస్తాం’’ అని వెల్లడించారు.
ఆ విషయం భారత్కు వదిలేయండి..: జెన్సాకీ
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇక పెంచబోమని భారత్ నుంచి ఏమైనా హామీని అధ్యక్షుడు జోబైడెన్ సాధించారా..? అన్న ప్రశ్నకు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్సాకీ స్పందించారు. ‘‘ ఈవిషయాన్ని ప్రధాని మోదీ, భారతీయులకు వదిలేయండి. వారు ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది కేవలం 1 నుంచి 2శాతం మాత్రమే. వారు అమెరికా నుంచి 10శాతం కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు.. ఆంక్షలకేమీ విరుద్ధం కావు. ఇది నిర్మాణాత్మకమైన సంభాషణ కాదు. మేము వేర్వేరు దేశాలకు ఉండే సొంత అవసరాలను పరిగణనలోకి తీసుకొంటాం’’ అంటూ జెన్సాకీ తోసిపుచ్చారు. భారత్ నుంచి ఉక్రెయిన్కు మానవీయ సాయం పంపడాన్ని ఆమె అభినందించారు.
మానవహక్కుల ఉల్లంఘనల ప్రస్తావన..
భారత్లో మానవహక్కుల ఉల్లంఘనలు పెరగడాన్ని గమనించినట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అన్నారు. వీటికి ముగింపు పలికేవరకు ఈ అంశంపై నిరంతరం భారత్తో మేము సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఆందోళనకర ఘటనలు పెరగడాన్ని గమనించామని తెలిపారు. వీటిల్లో జైళ్ల సిబ్బంది, పోలీసులు పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు కూడా ఉన్నాయన్నారు. అంతకు మించి బ్లింకన్ మరే వివరాలను వెల్లడించలేదు.
మోదీని, భారత్ను విమర్శించడానికి ఇష్ట పడటంలేదా? అని ప్రతినిధుల సభకు చెందిన రిప్రజెంటేటీవ్ ఇల్హాన్ ఒమర్ కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బ్లింకన్ మానవహక్కులపై వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.