Ukraine Crisis: రష్యా.. ఫేస్బుక్.. పోటాపోటీ ఆంక్షలు!
ఉక్రెయిన్పై సైనిక చర్య విషయంలో రష్యాను నిలువరించేందుకు అమెరికాతోపాటు యూరప్ దేశాలు ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్ఫాంలపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించడంతోపాటు ఆదాయ మార్గాలను కట్టడి చేస్తున్నట్లు ప్రముఖ సామాజిక...
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై సైనిక చర్య విషయంలో రష్యాను నిలువరించేందుకు అమెరికాతోపాటు యూరప్ దేశాలు ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్ఫాంలపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించడంతోపాటు ఆదాయ మార్గాలను కట్టడి చేస్తున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వెల్లడించింది. రష్యా మీడియా అనుబంధ సంస్థలకూ ఈ ఆంక్షలను వర్తింపజేస్తున్నట్లు మెటా సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియల్ గ్లీచెర్ ట్విటర్లో తెలిపారు. ఈ ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని, వారాంతం వరకు కొనసాగుతాయని చెప్పారు. అంతకుముందు.. తమ దేశంలో ‘ఫేస్బుక్’ వినియోగంపై పాక్షిక పరిమితులు విధిస్తున్నట్లు రష్యా అధికార వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ మీడియాను సెన్సార్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి.
ఈ ఆంక్షలను ఎత్తివేయాలని తాము చేసిన డిమాండ్ను పట్టించుకోలేదని, అందుకే ఫేస్బుక్ వినియోగంపై పరిమితులు విధించామని రష్యా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా దాడులు వరుసగా మూడో రోజూ కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకొనేందుకు రష్యా సేనలు యత్నిస్తుండగా.. ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈ నగరంలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్థానికంగా 35 మంది పౌరులు చనిపోయినట్లు కీవ్ నగర మేయర్ తెలిపారు. అయితే, రష్యన్ బలగాలను ఎదుర్కొనేందుకు తమ పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇందుకోసం పశ్చిమ దేశాలు తమకు ఆయుధాలను పంపిస్తున్నాయని తాజాగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు