SpaceX: ఉక్రెయిన్ భారం మోయలేము.. పెంటగాన్కు స్టార్లింక్ లేఖ..!
ఉక్రెయిన్ దళాలకు ఇంటర్నెట్ మరింత కష్టం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో మౌలిక వసతులు దెబ్బ తిన్న ఆ దేశానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇంటర్నెట్ను అందిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్ దళాలకు ఇంటర్నెట్ మరింత కష్టమయ్యే అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో మౌలిక వసతులు దెబ్బ తిన్న ఆ దేశానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇంటర్నెట్ను అందిస్తోంది. రష్యాపై పోరాటంలో ఆ దేశ సైన్యానికి, ప్రజలకు ఇది కీలక వనరుగా మారింది. స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటి వరకు దాదాపు 20,000 స్టార్ లింక్ శాటిలైట్ యూనిట్లను విరాళంగా ఇచ్చింది. ఉక్రెయిన్ కోసం దాదాపు 80 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ఇటీవల ఎలాన్ మస్క్ తన ట్విటర్లో వెల్లడించారు. ఏడాది చివరి నాటికి ఈ ఖర్చు 100 మిలియన్ డాలర్లను దాటేస్తుందని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో గత నెల స్పేస్ఎక్స్ నుంచి పెంటగాన్కు వెళ్లిన ఓ లేఖను అమెరికా పత్రిక సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. తమ స్వచ్ఛంద సాయం ముగింపునకు వచ్చిందని.. పెంటగాన్ ప్రతినెలా పదుల మిలియన్ల డాలర్లను వెచ్చిస్తేనే సర్వీసుల కొనసాగింపు సాధ్యమవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్కు స్టార్ లింక్ సేవలకు నిధుల బాధ్యతలను పెంటగాన్ తీసుకోవాలని కోరింది. ఈ ఏడాది మిగిలిన సమయానికి 120 మిలియన్ డాలర్లు ఖర్చుకానుండగా.. వచ్చే 12 నెలలకు 400 మిలియన్ డాలర్లకు పైగా అవుతుందని అంచనావేసింది. ‘‘ఉక్రెయిన్కు ఇక టర్మినల్స్ విరాళం ఇచ్చే స్థితిలో మేము లేము. ప్రస్తుతం ఉన్న వాటికి నిర్వహణకు ఎన్నాళ్లు నిధులు వెచ్చిస్తామో చెప్పలేము’’ అని స్పేస్ ఎక్స్ గవర్నమెంట్ సేల్స్ విభాగం డైరెక్టర్ పెంటగాన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఇటీవల మస్క్ ఓ శాంతి ప్రణాళికను ప్రతిపాదించి విమర్శల పాలయ్యారు. తన శాంతి ప్రణాళికలో భాగంగా పలు ప్రతిపాదనలతో ట్వీట్లు చేశారు. ‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’ అని ట్విటర్లో ఓటింగ్ పెట్టారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన మరిచిపోక ముందే తాజాగా స్టార్ లింక్ లేఖ వెలుగుచూడటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్