Niger crisis: నైగర్ సంక్షోభం.. తమ పౌరులను తరలించనున్న ఫ్రాన్స్!
సైన్యం తిరుగుబాటుతో ఆఫ్రికా దేశం నైగర్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అక్కడ నివాసం ఉంటున్న తమ పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సిద్ధమైంది.
నియామి: పశ్చిమ ఆఫ్రికా (West Africa)లోని నైగర్ (Niger)లో అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ (Mohamed Bazoum)కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు (Military Coup) చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూలదోసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవల రాజధాని ‘నియామి’లో సైనిక ప్రభుత్వ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో తమను పాలించిన ఫ్రాన్స్ (France)పై మండిపడుతూ.. ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి నిప్పంటించారు. ఈ పరిణామాల మధ్య ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నైగర్లో నివాసం ఉంటున్న ఫ్రాన్స్ పౌరులను తరలించేందు (Evacuation)కు సిద్ధమైంది. ఈ మేరకు అక్కడి రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
నైగర్లో ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి నిప్పు
‘నైగర్లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇటీవలే మన దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. గగనతలం మూసివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఫ్రాన్స్ పౌరులను, ఐరోపావాసులను ఇక్కడినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. నియామి నుంచి విమానాల ద్వారా ఈ తరలింపు ప్రక్రియను నేడు ప్రారంభిస్తాం’ అని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్ రాయబార కార్యాలయం, తమ దేశ ప్రయోజనాలపై దాడులను ఉపేక్షించబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫ్రాన్స్ పౌరులు, సైన్యం, రాయబారులు, ఫ్రాన్స్ అధికారులపై ఎవరైనా దాడికి పాల్పడితే తక్షణం ప్రతిస్పందనను చవిచూస్తారని హెచ్చరించారు. ఈ పరిణామాల నడుమ పౌరుల తరలింపు ప్రక్రియ చేపడుతున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.