Pakistan: అప్పుల ఊబిలో పాక్.. కోట్లు గడించిన ఆర్మీ చీఫ్ బజ్వా
పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ ఈ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. గత ఆరేళ్లలో ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగినట్లు కథనాలు వస్తుండటం కలకలం రేపుతోంది.
ఇస్లామాబాద్: అప్పుల కుప్పలు నానాటికీ పెరుగుతూ పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుండగా.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా రూ. కోట్లు గడిస్తున్నారట. గత ఆరేళ్లలో ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగినట్లు తాజా కథనం ఒకటి బయటికొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆర్మీ చీఫ్గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం దేశంలో కలకలం రేపుతోంది.
బజ్వా ఆస్తులపై ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ ఈ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ జర్నలిస్టు దీన్ని బయటపెట్టారు. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు దేశ, విదేశాల్లో రూ.కోట్ల విలువైన వ్యాపారాలను ప్రారంభించారని, లగ్జరీ ఆస్తులను కొనుగోలు చేశారని ఆ కథనం వెల్లడించింది. ఇస్లామాబాద్, కరాచీల్లో కమర్షియల్ ప్లాజాలు, ప్లాట్లు.. లాహోర్లో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీని వీరు కొనుగోలు చేశారని పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తులు, వ్యాపారాల విలువ 12.7 బిలియన్ పాకిస్థానీ రూపాయలకు పైనే (అమెరికా కరెన్సీలో దాదాపు 56 మిలియన్ డాలర్లు) ఉంటుందని సదరు కథనం వెల్లడించింది.
2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్ తన ఆస్తుల విలువను రూ.సున్నాగా ప్రకటించారు. అయితే ఒక్క ఏడాదిలోనే అంటే 2016లో ఆమె ఆస్తులు రూ.220కోట్లకు చేరడం గమనార్హం. అటు బజ్వా కోడలు మహనూర్ సాబిర్ ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. 2018 నవంబరులో బజ్వా కుమారుడితో మహనూర్ వివాహం జరిగింది. పెళ్లికి ముందు సున్నాగా ఉన్న మహనూర్ ఆస్తులు.. వివాహమైన వారానికే రూ.127కోట్లకు పెరిగాయని ఫ్యాక్ట్ ఫోకస్ కథనం తెలిపింది. పాక్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయిన బజ్వా మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న సమయంలో ఈ కథనం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆదివారం ఈ కథనం బయటకు రాగానే.. పాకిస్థాన్లో ఈ వెబ్సైట్ను బ్లాక్ చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.