Modi- Putin: పుతిన్- మోదీ ఫోన్ సంభాషణ.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. వివిధ ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
దిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం రష్యా అధినేత పుతిన్ (Putin)తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘భారత్, రష్యాల మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ సానుకూల పరిణామాలపై చర్చించాం. ‘బ్రిక్స్ (BRICS)’ కూటమికి మాస్కో నాయకత్వం సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’’ అని తెలిపారు.
ఇరుదేశాల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై పురోగతిని నేతలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘బ్రిక్స్’కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రష్యాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పినట్లు వెల్లడించింది. భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు, పుతిన్తోనూ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు పుతిన్ ఆ సందర్భంగా తెలిపారు.
చైనా.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదట!
దాదాపు రెండేళ్లుగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నప్పటికీ.. భారత్తో మాత్రం రష్యా సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై ఆచితూచి అడుగులు వేస్తోన్న దిల్లీ.. దౌత్యం, సంప్రదింపుల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని ఇరుదేశాలకు సూచిస్తోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తోంది. ఐరాసలో ఉక్రెయిన్ అనుకూల తీర్మానాల విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడి తట్టుకొని స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా.. మాస్కో- దిల్లీల మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని పుతిన్ కూడా స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!