Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry) కోర్టు విచారణకు హాజరై సాక్ష్యమిచ్చారు. ఆ సంస్థ కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో న్యాయస్థానానికి వినిపించారు.
లండన్: బ్రిటన్ (Briatin) రాజకుటుంబం (Royal Family) చరిత్రలోనే ఓ కొత్త పరిణామం. 130 ఏళ్లలో తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. ఫోన్ హ్యాకింగ్కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా కింగ్ ఛార్లెస్ 3 రెండో తనయుడు ప్రిన్స్ హ్యారీ (Prince Harry) కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.
బ్రిటన్కు చెందిన మిర్రర్ గ్రూప్ (Mirror Group Newspapers).. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ (phone hacking case) ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్ కోర్టులో విచారణ చేపట్టగా.. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
ప్రస్తుతం తన భార్య మేఘన్ మర్కెల్, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్ చేరుకున్నారు. ఈ ఉదయం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో హ్యారీ (Prince Harry) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ హ్యాకింగ్కు పాల్పడటమే గాక.. 1996 - 2010 మధ్య ప్రైవేటు ఇన్విస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్ గ్రూప్ (Mirror Group) తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తెలిపారు. ఇలా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్ను ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు.
వాస్తవానికి ఈ కేసులో ప్రిన్స్ హ్యారీ సోమవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆయన రాలేదు. జూన్ 4న ఆయన కుమార్తె ప్రిన్సెస్ లిలిబెత్ పుట్టినరోజు కావడంతో లాస్ఏంజిల్స్ నుంచి ఆయన ఆలస్యంగా బయల్దేరారని హ్యారీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా.. ఈ కేసులో మిర్రర్ గ్రూప్ తరఫు న్యాయవాదులు హ్యారీని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో హ్యారీని కోర్టులో ప్రశ్నించనున్నట్లు సమాచారం.
గతంలో కింగ్ ఎడ్వర్డ్ VII కూడా..
కాగా.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఈ రెండు కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు..
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్