Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై జరిగిన దాడి షాక్ గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్కు వెల్లడించారు.
న్యూయార్క్: ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై జరిగిన దాడి షాక్కు గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్కు వెల్లడించారు. ఈ దాడిలో చేతుల్లోని నరాలు తెగిపోయాయని.. ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించారు.
శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్లో వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతోన్న రష్దీ వద్దకు ఓ వ్యక్తి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. 20 సెకన్ల వ్యవధిలోనే 10-15 సార్లు కత్తిపోట్లు పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. మొదట ఇందంతా ఒక స్టంట్ అని భావించామన్నారు. ‘దుండగుడు నల్లని దుస్తులు ధరించి, నలుపు రంగు మాస్క్ పెట్టుకొని వేదికిపైకి దూసుకొచ్చాడు. ఈ రచయిత చుట్టూ ఇంకా వివాదాలున్నాయని చూపించేందుకు ఓ స్టంట్ చేస్తున్నారని మొదట అనుకున్నాం. కానీ కొన్నిసెకన్లలో అది నిజమైన దాడి అని అర్థమైంది. 20 సెకన్లలో 10 నుంచి 15 సార్లు ఆయన్ను పొడిచాడు’ అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కొన్ని గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన ఒక కంటిని కోల్పోనున్నట్లు తెలుస్తోంది. పొత్తి కడుపులో కత్తిపోటు కారణంగా కాలేయం తీవ్రంగా దెబ్బతిందని బుక్ ఏజెంట్ చెప్పారు.
పోలీసుల అదుపులో దుండగుడు.. రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తి పేరు హాది మతార్. అతడు న్యూజెర్సీకి చెందిన వ్యక్తని గుర్తించారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
దాడిని ఖండించిన అమెరికా.. ఈ రచయితపై జరిగిన దాడిని శ్వేతసౌధ ప్రతినిధి ఖండించారు. ‘ఇది భయానకమైనది. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను కాపాడుకునేందుకు తక్షణమే స్పందించిన పౌరులు, సిబ్బందికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
స్పందించిన శశిథరూర్.. రష్దీపై జరిగిన దాడి షాక్కు గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గాయాల నుంచి కోలుకొని, తిరిగి మామూలు మనిషి కావాలని ఆకాక్షించారు. సృజనాత్మక వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేకపోతే.. అది నిజంగా విచారకరమని వ్యాఖ్యానించారు.
1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్కు తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్నైట్ చిల్డ్రన్ (Midnight Children) నవలకు 1981లో ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ దక్కడంతో ఆయన ఫేమస్ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ‘ది సాతానిక్ వెర్సెస్’ (The Satanic Verses) నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరుస్తోందని పేర్కొంటూ 1988 నుంచి ఇరాన్లో ఈ నవలను నిషేధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు