Minor Students: పైశాచికం.. 15 మంది బాలురపై టీచర్ల అత్యాచారం
పాకిస్థాన్లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్స్లో 15 మంది విద్యార్థులపై ఇద్దరు టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
లాహోర్: పాకిస్థాన్లోని పంజాబ్ (Pakistan Punjab) ప్రావిన్స్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మతపరమైన విద్యా సంస్థలో చదువుతున్న 15 మంది మైనర్ విద్యార్థులపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి (Rape attempt) పాల్పడ్డారు. విషయం వెలుగులోకి రావడంతో శుక్రవారం వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఉస్మాన్ అన్వర్ సోమవారం వెల్లడించారు. విద్యార్థులంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారేనని ఆయన తెలిపారు. మరోవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని, ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.
బాధిత విద్యార్థి ఒకరు తనకు జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే పాఠశాల దగ్గర దించుతుండగా అందులో చదువుతున్న ఓ విద్యార్థి తన తండ్రి ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకని ప్రశ్నించగా వెక్కివెక్కి ఏడుస్తూ విషయం చెప్పాడు. ఈ సమస్య తనొక్కడిదే కాదని, తన లాంటివారు చాలా మంది ఉన్నారని చెప్పడంతో వెంటనే ఆ తండ్రి పంజాబ్ పోలీసులను ఆశ్రయించాడు. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపిన పోలీసులు... జరిగిన విషయాన్ని తెలుసుకొని నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాధితులైన 15 మంది విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరగడం వాస్తవమేనని తేలింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలపై పంటిగాట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఓ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మోహ్సిన్ నఖ్వీ స్పందించారు. బాధిత కుటుంబాలను న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నేరస్తులకు కఠిన శిక్షపడేలా చేయాలని ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.