బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. సంపన్నులకు పన్ను కోతపై వెనక్కి!
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే యూటర్న్ తీసుకున్నారు. సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు.
లండన్: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే యూటర్న్ తీసుకున్నారు. సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చిన ఆమె.. అందుకు అనుగుణంగా 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే, మార్కెట్ ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రిషి సునాక్పై విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ ప్రభుత్వం 10 రోజుల క్రితం మినీ బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. అందులో అధికాదాయం కలిగిన సంపన్నులకు ఆదాయపు పన్నులో 45 శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఛాన్సలర్ క్వాసీ క్వార్టెంగ్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అయితే, మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతల నుంచీ వ్యతిరేకత రావడంతో పన్ను కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఛాన్సలర్ క్వాసీ క్వార్టెంట్ కీలక ప్రకటన చేశారు. ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దేశ వృద్ధి గురించే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకున్న సందర్భాలున్నాయంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా గడిచిన 12 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూశానని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని లిజ్ ట్రస్ సైతం ట్వీట్ చేశారు. బ్రిటన్ను ముందుకు తీసుకెళ్లాలన్న తమ నిర్ణయానికి పన్ను కోత అంశం అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. వృద్ధికి చర్యలు తీసుకుంటూ.. దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. అయితే, పన్ను కోత నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆదివారం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న మరుసటి రోజే లిజ్ ట్రస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. అంతేకాదు.. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్తో తనను పోల్చుకునే లిజ్ ట్రస్కు రాజకీయంగా ఈ నిర్ణయం మచ్చలాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘వెనక్కి తిరిగి చూసే నైజం’ కాదని చెప్పుకొనే థాచర్ను అనుసరించే వ్యక్తి.. ఇలా అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే యూటర్న్ తీసుకోవడం ఇందుక్కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు