Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు మొదలయ్యాయ్.. యుద్ధం ముగిసేనా?
బెలారస్ వేదికగా ఉక్రెయిన్- రష్యా ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.
ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు
కీవ్/మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ సోమవారం కీలక అడుగు పడింది. యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య కీలక చర్చలు మొదలయ్యాయి. బెలారస్ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఈ చర్చలకు ఇరుదేశాల ప్రతినిధులూ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య చర్చలు మొదలైనట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ధ్రువీకరించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. రష్యా అధ్యక్ష కార్యాలయం సహా రక్షణ, విదేశాంగ శాఖకు చెందిన అధికారులు ఈ భేటీకి హాజరు కాగా.. ఉక్రెయిన్ నుంచి పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందే రష్యా, ఉక్రెయిన్లు తమ డిమాండ్లను స్పష్టంచేశాయి. తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేయగా.. తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. అలాగే, ఐరోపా యూనియన్లో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు. మరోవైపు, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ భూభాగం బాంబులు, తుపాకీ మోతతో దద్ధరిల్లి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ చర్చల పురోగతిపై యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
4500 మంది రష్యా సైనికులు హతం: ఉక్రెయిన్ ప్రకటన
ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ నడుస్తుండటంతో రష్యా ఈరోజు దాడుల తీవ్రతను తగ్గించింది. ఉక్రెయిన్ నగరాల్లోకి ప్రవేశిస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులను స్థానిక ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి అడ్డుకొంటున్నారు. ఇప్పటివరకు 4500 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్టు ఉక్రెయిన్ మిలటరీ స్పష్టంచేసింది. అలాగే, రష్యా దాడిలో 350 మంది తమ పౌరులు మృతిచెందారని వెల్లడించింది. రష్యాను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిని తమ సైన్యం చేర్చుకుంటోంది.
యుద్ధ రంగంలోకి బెలారస్ దూకుతుందా?
రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా యుద్ధ రంగంలోకి దూకబోతుందంటూ అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రష్యా దళాలతో కలిసి పోరాడేందుకు బెలారస్ తమ దళాల్ని ఉక్రెయిన్లోకి పంపుతోందని అమెరికా నిఘా అధికారి తెలిపారు. రష్యాకు మద్దతుగా నిలుస్తోన్న బెలారస్.. ఇప్పటివరకు యుద్ధంలో పాల్గొనలేదు. అయితే, ఆ దేశం యుద్ధంలోకి వస్తుందా? లేదా అన్నది రష్యా ఉక్రెయిన్ చర్చలపై ఆధారపడి ఉంటుందని నిఘా అధికారి తెలిపారు. ఉక్రెయిన్ ప్రతిఘటనతో రష్యా బలగాల దండయాత్ర చాలా కష్టంగా మారిందని అమెరికా విశ్వసిస్తోంది.
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణతో పలు ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. రష్యాపై ఆంక్షలు డోసును పెంచుతున్నాయి. తాజాగా రష్యా విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్టు యూరోపియన్ దేశాలు వెల్లడించాయి. 13 దేశాలు తమ విమానాలపై నిషేధం విధించడంపై స్పందించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల