Zelenskyy: రష్యా దాడి తర్వాత.. మేం ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాం..!
తమ మీద తమకు తప్ప, ఈ ప్రపంచ మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భుభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
కీవ్: తమ మీద తమకు తప్ప.. ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
‘నేను ఈ ప్రపంచాన్ని నమ్మను. వారు చెప్పే మాటల్ని మేం నమ్మం. రష్యాతో యుద్ధం తీవ్రమైన తర్వాత.. మా పొరుగుదేశాలపై విశ్వాసం లేదు. ఇప్పుడు మాకున్న నమ్మకం ఒక్కటే.. మాపై, మా ప్రజలపై, మా బలగాలపై నమ్మకం ఉంది. ప్రపంచ దేశాలు మాటలతో కాకుండా చేతలతో మాకు మద్దతు ఇస్తాయని నమ్ముతున్నాం’ అని వెల్లడించారు.
అలాగే శాంతి చర్చల గురించి మాట్లాడుతూ..‘రష్యా నిర్దేశించిన నిబంధనల మధ్య మేం చర్చించడానికి సిద్ధంగా లేం. ఈ యుద్ధం ఖరీదు మా ప్రజలు. వారి హత్యలు. ఇదంతా ఎవరు చెల్లిస్తారు..? ఆ నష్టాన్ని భరించాల్సింది ఉక్రెయిన్ మాత్రమే. మేం పెను భారాన్ని మోస్తున్నాం. మాకు మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడతాం. రష్యన్ అల్టిమేటం కింద మాత్రమే మేం మాట్లాడాలా..? చర్చలు మంచివా కాదా తర్వాత సంగతి. అసలు మా పట్ల ఆ దేశం వైఖరే ఇక్కడ ముఖ్యం. ఇలా నిబంధనల కింద మాట్లాడటం అసాధ్యం’ అని స్పష్టం చేశారు.
డాన్బాస్ ప్రాంతంలో రష్యా సైన్యంతో పోరాడేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ తూర్పు భాగాన్ని వదులుకోమని స్పష్టం చేశారు. ‘రష్యా డాన్బాస్ను ఆక్రమించుకోగలిగితే.. కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి మళ్లీ ప్రయత్నించదని కాదు. అందుకే వారిని నిలువరించాలి. ఇది.. ఈ యుద్ధం తీరుతెన్నులను మార్చివేస్తుంది’ అని వెల్లడించారు.
ఉక్రెయిన్ సంక్షోభం.. ఐదోవంతు మంది పేదరికంలోకి..
ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ జనాభాలో ఐదోవంతు కంటే ఎక్కువ మందికి పేదరికం, ఆకలి ముప్పుఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఉక్రెయిన్ విషాదం మనందరికీ కనిపిస్తోంది. కానీ ఆ యుద్ధం సరిహద్దును దాటి ప్రపంచంపై నిశ్శబ్ద దాడిని ప్రారంభించింది. దశాబ్దాలుగా చూడని విధంగా 1.7 బిలియన్ల ప్రజలకు ఆకలి, పేదరికం ముప్పు పొంచి ఉంది’ అని హెచ్చరించింది. ఈ యుద్ధం సరఫరా గొలుసుల్ని దెబ్బతీసిందని పేర్కొంది. 2022 ప్రారంభం నుంచి గోధుమ, మొక్కజొన్న ధరలు 30 శాతం పెరిగాయని, చమురు ధరలు 60 శాతం, గ్యాస్, ఎరువుల ధరలు రెండింతలయ్యాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్