UN Chief: ఆ విపత్తును అడ్డుకోండి.. అసాధారణ అధికారాన్ని వినియోగించిన ఐరాస చీఫ్!
గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి (Security Council) చర్యలు చేపట్టాలని కోరుతూ యూఎన్ చార్టర్లోని ఆర్టికల్ 99ను వినియోగించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ చేస్తోన్న ప్రతిదాడుల్లో (Israel Hamas Conflict) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసాధారణ అధికారాలను వినియోగించేందుకు సిద్ధమైంది. గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి (Security Council) చర్యలు చేపట్టాలని కోరుతూ యూఎన్ ఛార్టర్లోని ఆర్టికల్ 99ను వినియోగించాలని నిర్ణయించింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు దాడులు మరింత తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఐరాస చీఫ్ (Antonio Guterres) ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘ఐరాస చీఫ్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఐరాస చార్టర్లోని ఆర్టికల్ 99ను అమలు చేస్తున్నా. గాజాలో మానవతా వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం నెలకొన్న వేళ.. ఆ విపత్తును నివారించడానికి భద్రతా మండలి సహాయం చేయాలని కోరుతున్నా. దీంతోపాటు మానవతావాద కాల్పుల విరమణను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు.
ఏమిటీ ఆర్టికల్ 99?
ఐరాసలోని ఆర్టికల్ 99 అనేది సెక్రటరీ జనరల్ చేతిలో ఉన్న స్వతంత్ర సాధనంగా పేర్కొంటారు. దీని ప్రకారం, ప్రపంచ శాంతి, భద్రతా నిర్వహణకు ముప్పుగా పరిగణించే ఏ విషయాన్నైనా భద్రతా మండలి దృష్టికి ఐరాస చీఫ్ తీసుకెళ్లొచ్చు. ఈ ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశపరచవచ్చు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణపై శక్తివంతమైన భద్రతామండలి (UNSC) ఎటువంటి తీర్మానాలు ఆమోదించని నేపథ్యంలో ఐరాస చీఫ్ ఈ ఆర్టికల్ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఐరాస చీఫ్ సూచనలకు అనుగుణంగా కాల్పుల విరమణ చేయాలంటూ ఉభయ పక్షాలను కోరుతూ భద్రతా మండలి ఏదైనా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ ప్రాంతంలో శాంతిస్థాపనకు వివిధ మార్గాలను అనుసరిస్తారు. అంతర్జాతీయ బలగాలను మోహరించడం, ఒకటి లేదా రెండు పక్షాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇదిలాఉంటే, గాజాలో ఉన్న హమాస్ బెటాలియన్ కమాండర్లలో సగానికిపైగా మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. మొన్నటివరకు ఉత్తర గాజాలో భీకర దాడులు చేసిన ఐడీఎఫ్.. ప్రస్తుతం దక్షిణ గాజాలోనూ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో పాలస్తీనియన్లు తలదాచుకునేందుకు సురక్షిత చోటు లేకుండా పోయింది. ఇలా గాజాలో మానవతా పరిస్థితులు క్షీణిస్తుండటంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తును అడ్డుకునేందుకు ఐరాస భద్రతా మండలి చర్యలు చేపట్టాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.