Vedant Patel: ఆయన టాలెంట్ అమోఘం.. రోజూ బైడెన్కు సహకరిస్తుంటారు..!
అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు.
శ్వేతసౌధంలో ప్రవాస భారతీయుడిపై ప్రశంసలజల్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు. వారంతా శ్వేతసౌధంలో అధ్యక్షుడి కార్యకలాపాలు సజావుగా సాగేలా.. చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకరే వేదాంత్ పటేల్. ఆయన శ్వేతసౌధంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయనపై ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనో అద్భుతమైన రచయితని, నిత్యం బైడెన్తో సహా తమకు సహకరిస్తుంటారని అభినందించారు.
‘మీకు సులభమైన పని అప్పగించామంటూ తరచూ మేం వేదాంత్ను ఆటపట్టిస్తుంటాం. కానీ అలా ఏముండదు. ఆయన సూపర్ టాలెంటెడ్ కాబట్టి, పని సులభంగా మారుతుంటుంది. ఆయన గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలా అందంగా రాస్తారు. అంతే వేగంగా కూడా పనిచేస్తారు. ఆయనకు ప్రభుత్వంలో మున్ముందు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. ప్రతిరోజు అధ్యక్షుడికి, మాకు సహకరించే విషయంలో ఆయన వ్యవహరించే తీరు అద్భుతం’ అంటూ జెన్సాకీ మెచ్చుకున్నారు.
ఈ వేదాంత్ ఎక్కడివారు..?
వేదాంత్ పటేల్(32) స్వరాష్ట్రం గుజరాత్. వేదాంత్ పుట్టిన తర్వాత ఆయన కుటుంబం కాలిఫోర్నియాకు వలస వెళ్లింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (రివర్సైడ్) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఎంబీఏ పట్టా పొందారు. శ్వేతసౌధంలో అసిస్టెంట్ మీడియా సెక్రటరీగా చేరకముందే.. ఎన్నికల ప్రచారంలో బైడెన్తో కలిసి పనిచేశారు. 2012లో మాజీ చట్టసభ సభ్యుడు మైక్ హోండా వద్ద డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి, ఇప్పుడు బైడెన్కు అడుగడుగునా సహకరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రశ్నలకు ఈయనే బదులిస్తారు.
‘1991లో మా కుటుంబం గుజరాత్ నుంచి ఇక్కడకు వచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కృషి వల్లే ఈ రోజు నేను శ్వేతసౌధంలో కూర్చొని పనిచేస్తున్నాను’ అంటూ గతంలో చేసిన ట్వీట్లో వేదాంత్ తన మూలాలను గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా