Xi Jinping: మూడేళ్ల తర్వాత చైనాను దాటి బయటకు రానున్న షీజిన్‌పింగ్‌..!

కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ విదేశీ పర్యటనలు చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన చైనా ప్రధాన భూభాగాన్ని దాటి బయటకు వచ్చి

Published : 26 Jun 2022 16:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ విదేశీ పర్యటనలు చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన చైనా ప్రధాన భూభాగాన్ని దాటి బయటకు వచ్చి హంగ్‌కాంగ్‌లో పర్యటించనున్నారు. అక్కడ హాంగ్‌కాంగ్‌ 25 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ షిన్హువా ధ్రువీకరించింది.  దీంతోపాటు ఆయన అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  జులై1 తేదీ నుంచి హాంగ్‌కాంగ్‌ కొత్త నాయకుడిగా జాన్‌ లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో  జిన్‌పింగ్‌ పాల్గొంటారని ఆ వార్తాసంస్థ పేర్కొంది. 

మరోపక్క హాంగ్‌కాంగ్‌ సీనియర్‌ అధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో జిన్‌పింగ్‌ పర్యటన కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, హాంగ్‌కాంగ్‌ 25వ స్వాధీన దినోత్సవ వేడుకలు కావడంతో దీనికి చాలా ప్రాధాన్యముంది. 2019లో ఇక్కడ చెలరేగిన ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమాన్ని అణచివేసి, ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత తొలిసారి ఏర్పడ్డ ప్రభుత్వ ప్రమాణ వేడుక కూడా ఉండటంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని