AP News: సీఎం జగన్‌ పక్కనే.. సీబీఐ వెతుకుతున్న నిందితుడు

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున ఉద్ధృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిలతో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు. 

Published : 16 Apr 2024 09:30 IST

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున ఉద్ధృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిలతో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు. 

Tags :

మరిన్ని