YSRCP: కదిరిలో వైకాపా నేతల కుమ్ములాట.. వేదికపైనే బాహాబాహీ
శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గ వైకాపా వర్గ పోరు రచ్చకెక్కింది. వేదికపై కూర్చొనే విషయంలో తలెత్తిన వివాదం.. కుర్చీలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇవాళ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే, మంత్రి అక్కడికి రాకముందే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పూల శ్రీనివాసులురెడ్డి వర్గీయులు వేదికపైనే బాహాబాహీకి దిగారు. తమ వారిని వేదికపైకి రానీయకుండా అడ్డుకున్నారంటూ ఎమ్మెల్యే వర్గీయుడు శివారెడ్డిని.. పూల శ్రీనివాసులు రెడ్డి అనుచరులు చితకబాదారు. ఇరువర్గాల అరుపులు, కేకలతో సమావేశ ప్రాంగణం గందరగోళంగా మారింది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి వేదిక వద్దకు వస్తున్నారంటూ గుంపును పోలీసులు చెదరగొట్టారు.
Updated : 18 Dec 2022 19:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు