Anakapalli: పోలీసుల సమక్షంలోనే.. కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైకాపా దాడి..!

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. 

Updated : 05 May 2024 10:29 IST

Anakapalli: పోలీసుల సమక్షంలోనే.. కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైకాపా దాడి..!

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోయింది.  కూటమి అభ్యర్థికి మద్దతిస్తోన్న ఓ కార్యకర్త ఇంటి వద్ద డ్రోన్‌ కెమెరాతో ప్రచారం చేసుకుంటున్న సమయంలో.. వైకాపా నాయకులు, కార్యకర్తలు వచ్చి నలుగురిపై దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌ కెమెరాతో పాటు సామగ్రిని ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న బూడి ముత్యాల నాయుడు భాజపా నాయకుడిపై చెప్పుతో దాడి చేశారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దెబ్బలుతిన్న కార్యకర్తలనే స్టేషన్‌కు తీసుకెళ్లారని కూటమి నేతలు తెలిపారు. 

Tags :

మరిన్ని