Nara Brahmani: మంగళగిరి ప్రజలు నన్ను కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు!: నారా బ్రాహ్మణి

మంగళగిరి ప్రజల ఆదరణ చూస్తుంటే.. ఈ ప్రాంతంలోనే లోకేశ్‌ పుట్టారా? అనిపిస్తోందని నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ప్రధాన వీధుల్లో నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి రోడ్ షో నిర్వహించారు. బ్రాహ్మణిని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద ఆగి ఆమె అల్పాహారం తీసుకున్నారు.

Published : 04 May 2024 22:06 IST

మంగళగిరి ప్రజల ఆదరణ చూస్తుంటే.. ఈ ప్రాంతంలోనే లోకేశ్‌ పుట్టారా? అనిపిస్తోందని నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ప్రధాన వీధుల్లో నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి రోడ్ షో నిర్వహించారు. బ్రాహ్మణిని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అడుగడుగునా మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద ఆగి ఆమె అల్పాహారం తీసుకున్నారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే నారా లోకేష్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని బ్రాహ్మణి విశ్వాసం వ్యక్తం చేశారు. తన జీవితంలో మొదటి సారి నిర్వహించిన రోడ్ షోలో.. ప్రజల ఉత్సాహం చూసి చాలా సంతోషంగా ఉందన్నారు.

Tags :

మరిన్ని