Janasena: వైకాపా ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే.. కేంద్రాన్ని నిలదీయాలి: నాదెండ్ల మనోహర్
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యానికి కారణమేంటని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడారు. మాండౌస్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం నిలదీయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలిస్తామని హామీలు ఇచ్చి,, వాటిని నెరవేర్చకుండా యువతను జగన్ సర్కారు మోసం చేస్తోందని ఆరోపించారు.
Published : 13 Dec 2022 13:10 IST
Tags :