Kurnool: చేతిలో ఇనుప రాడ్డుతో నడిరోడ్డుపై వ్యక్తి వీరంగం..!

కర్నూలు(Kurnool) జిల్లా పత్తికొండలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చేతిలో పెద్ద ఇనుప రాడ్డు పట్టుకుని రెండు కార్లు, ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన వన్నూరు సాహెబ్‌గా గుర్తించారు. పదేళ్ల క్రితం తన భార్య మృతి చెందినప్పటి నుంచి అతడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Updated : 29 Mar 2023 16:23 IST

Kurnool: చేతిలో ఇనుప రాడ్డుతో నడిరోడ్డుపై వ్యక్తి వీరంగం..!

కర్నూలు(Kurnool) జిల్లా పత్తికొండలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చేతిలో పెద్ద ఇనుప రాడ్డు పట్టుకుని రెండు కార్లు, ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన వన్నూరు సాహెబ్‌గా గుర్తించారు. పదేళ్ల క్రితం తన భార్య మృతి చెందినప్పటి నుంచి అతడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Tags :

మరిన్ని