Ponnam: రాష్ట్రంలో కరవు పరిస్థితులపై భారాస రాజకీయం: మంత్రి పొన్నం
గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు చెల్లించలేదని, రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై భారాస రాజకీయం చేస్తోందన్నారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.
Published : 27 Mar 2024 16:05 IST
Tags :