బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 15:54 IST

చిన్నాన్న కుమార్తెపైనే నిందలా?: సునీత

హైదరాబాద్‌: చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది.. ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? అని సీఎం జగన్‌ను వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? హత్య చేసిన వ్యక్తి.. ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారు. నిందితుల వెనుక వైఎస్‌ అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ఉన్నారని అంటున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు.. ఇప్పుడు మీరే వద్దన్నారు’’ అని పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు