News in Pics: చిత్రం చెప్పే సంగతులు-2(16-03-2023)

Updated : 16 Mar 2023 20:13 IST
1/22
సినీనటి కృతిశెట్టి తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పసుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కృతిశెట్టి, నాగచైతన్య జంటగా నటించిన ‘కస్టడీ’ సినిమా టీజర్‌ నేడు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీనటి కృతిశెట్టి తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పసుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కృతిశెట్టి, నాగచైతన్య జంటగా నటించిన ‘కస్టడీ’ సినిమా టీజర్‌ నేడు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
2/22
హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ సిగ్నల్‌ వద్ద ఓ బాలుడు బతుకుదెరువు కోసం అద్దాలు శుభ్రం చేస్తూ కనిపించాడు. హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ సిగ్నల్‌ వద్ద ఓ బాలుడు బతుకుదెరువు కోసం అద్దాలు శుభ్రం చేస్తూ కనిపించాడు.
3/22
వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌లో ఇద్దరు బాలురు సైకిళ్లపై విన్యాసాలు చేస్తూ సంబరపడిపోయారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌లో ఇద్దరు బాలురు సైకిళ్లపై విన్యాసాలు చేస్తూ సంబరపడిపోయారు.
4/22
పిడుగుపాటుకు నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని ధర్వేశిపురంలో ఓ కొబ్బరిచెట్టు దగ్ధమైంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటుకు నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని ధర్వేశిపురంలో ఓ కొబ్బరిచెట్టు దగ్ధమైంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
5/22
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను రూపొందించడాన్ని ఆమె కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను రూపొందించడాన్ని ఆమె కొనియాడారు.
6/22
భార్యాభర్తలిద్దరు కూలి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. దీంతో తన చిన్నారి కుమార్తెను ఒంటరిగా ఇంటి వద్ద ఉంచలేక తండ్రి తనతో పాటు పని చేసే చోటుకు తీసుకెళ్లారు. ఈ దృశ్యం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో కనిపించింది. భార్యాభర్తలిద్దరు కూలి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. దీంతో తన చిన్నారి కుమార్తెను ఒంటరిగా ఇంటి వద్ద ఉంచలేక తండ్రి తనతో పాటు పని చేసే చోటుకు తీసుకెళ్లారు. ఈ దృశ్యం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో కనిపించింది.
7/22
నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సినిమా ప్రమోషన్స్‌లో నాని వివిధ భాషల్లో ‘దసరా’ అని రాసి ఉన్న చొక్కాను ధరించి సందడి చేశారు. నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సినిమా ప్రమోషన్స్‌లో నాని వివిధ భాషల్లో ‘దసరా’ అని రాసి ఉన్న చొక్కాను ధరించి సందడి చేశారు.
8/22
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ శివారులోని సారంగపూర్‌ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ పనులను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ శివారులోని సారంగపూర్‌ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ పనులను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు.
9/22
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
10/22
విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.
11/22
‘దాస్‌ కా దమ్కీ’ చిత్రీకరణలో పాల్గొన్న విశ్వక్‌సేన్‌, రావు రమేశ్‌ తదితరులు ‘దాస్‌ కా దమ్కీ’ చిత్రీకరణలో పాల్గొన్న విశ్వక్‌సేన్‌, రావు రమేశ్‌ తదితరులు
12/22
వికారాబాద్‌లోని మర్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఉల్లి, కూరగాయల పంటలకు నష్టం కలగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌లోని మర్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఉల్లి, కూరగాయల పంటలకు నష్టం కలగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
13/22
మియామిలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో అమెరికన్‌ నటి, గాయని డెమి లవటో పాల్గొని ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు. మియామిలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో అమెరికన్‌ నటి, గాయని డెమి లవటో పాల్గొని ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.
14/22
బాలీవుడ్‌ నటి అలియాభట్ ఘనంగా తన జన్మదిన వేడుకలను చేసుకున్నారు. తన భర్త రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అలియా.. తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకోగా.. అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌ నటి అలియాభట్ ఘనంగా తన జన్మదిన వేడుకలను చేసుకున్నారు. తన భర్త రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అలియా.. తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకోగా.. అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
15/22
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా కనిపించింది. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా కనిపించింది.
16/22
తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎల్బీనగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చిత్రాలివి. తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎల్బీనగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చిత్రాలివి.
17/22
ఉపేంద్ర (Upendra) హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’(Kabzaa). ఆర్‌.చంద్రు దర్శకనిర్మాత. శివరాజ్‌కుమార్‌, సుదీప్‌, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి తాన్య ఇలా మెరిశారు. ఉపేంద్ర (Upendra) హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’(Kabzaa). ఆర్‌.చంద్రు దర్శకనిర్మాత. శివరాజ్‌కుమార్‌, సుదీప్‌, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి తాన్య ఇలా మెరిశారు.
18/22
సమంత (Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). నీలిమ గుణ నిర్మాత. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 14న తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో చిత్రబృందం పోస్టు చేసింది. సమంత (Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). నీలిమ గుణ నిర్మాత. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 14న తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో చిత్రబృందం పోస్టు చేసింది.
19/22
ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
20/22
ఉపేంద్ర (Upendra) హీరోగా, ఆర్‌.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’(Kabzaa). మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీరికి తితిదే ఛైర్మన్‌ వై. వి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉపేంద్ర (Upendra) హీరోగా, ఆర్‌.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’(Kabzaa). మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీరికి తితిదే ఛైర్మన్‌ వై. వి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
21/22
తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న నటుడు ఉపేంద్ర.. తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న నటుడు ఉపేంద్ర..
22/22
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు..

మరిన్ని