News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (18-09-2022)
Updated : 18 Sep 2022 21:30 IST
1/22
త్వరలో టీ20 వరల్డ్కప్ ఆడనున్న భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ నూతన జెర్సీని తీసుకువచ్చింది. బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసిన ఈ టీ20 జెర్సీ ఫొటో ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
2/22
హైదరాబాద్లోని పీవీ నరసింహారావు మార్గ్లో ఈట్ స్ట్రీట్ పక్కన అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హైటెక్ నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎయిర్ కండీషన్డ్ నీరా సెంటర్తో పాటు ఫుడ్ కోర్టులు అందుబాటులోకి తెస్తున్నారు. దసరాకు ప్రారంభిద్దామనుకుంటున్న ఈ నీరా దుకాణం ఎదుట ఆర్టీఫిషియల్ తాటి చెట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
3/22
4/22
సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో ఆదివారం ‘నవరాత్రి ఉత్సవ్ 2022’ దాండియా ధమాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు.
5/22
6/22
7/22
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పాపకు ఇప్పటి వరకు పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులు.. సురేశ్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేళ్ల పాపకు ‘మహతి’ అని నామకరణం చేశారు.
8/22
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భువనేశ్వర్కు చెందిన కళాకారిణి ప్రియాంక సహానీ బాదం పప్పులపై ప్రధాని జీవితంలో వివిధ దశలకు చెందిన చిత్రాలను తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
9/22
10/22
11/22
భాగ్యనగరానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దారి మధ్యలో వాహనాల టైర్ల గాలి దిగినా, పంక్చర్ అయినా పలువురు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి కూకట్పల్లికి చెందిన మల్లేశ్ అనే డ్రైవర్ చక్కని ఉపాయం ఆలోచించాడు. రూ.2,600తో ఓ చిన్న పోర్టబుల్ గాలియంత్రాన్ని కొనుగోలు చేశాడు. ప్రయాణం మధ్యలో జూపార్కు వద్ద టైర్లో గాలి దిగగా.. తన వాహనంలోని ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోర్టబుల్ యంత్రంతో గాలి నింపుతూ కనిపించాడు.
12/22
13/22
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం లండన్లోని లాన్సెస్టర్ హౌస్లో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్2 మృతికి సంతాపంగా బుక్ ఆఫ్ కండోలెన్సెస్లో సంతకం చేసి నివాళి అర్పించారు.
14/22
తైవాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి హువేలియన్ కౌంటీలో భారీ భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
15/22
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో దసరా పండగ సందర్భంగా ముందస్తు నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషలైట్ బినా మెహతా పలువురు మహిళలతో కలిసి గార్బా నృత్య ప్రదర్శన, దాండియా ఆటలు ఆడి సందడి చేశారు.
16/22
17/22
జపాన్లో నన్మడోల్ తుపాను రేగింది. దీంతో మియాజకి సముద్ర తీరంలో అలలు ఇలా ఎగిసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో భారీ గాలులు వీస్తాయని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు.
18/22
19/22
లండన్ పార్లమెంటు కాంప్లెక్స్లోని వెస్ట్మినిస్టర్ హాలులో రాణి ఎలిజబెత్-2 శవపేటిక ఉంచారు. పలువురు ఆ ప్రదేశానికి తరలివచ్చి రాణికి నివాళులర్పించారు.
20/22
మరి కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో కొందరు యువతులు సంప్రదాయ గార్బా నృత్యం సాధన చేస్తూ కనిపించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు.
21/22
22/22
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం