News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (07-10-2022)
Updated : 07 Oct 2022 22:11 IST
1/32
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నటీమణులు అనీషా, చాందినీ చౌదరీ, డిజైనర్లు పాల్గొని సందడి చేశారు.
2/32
3/32
4/32
5/32
6/32
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పూజల అనంతరం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు.
7/32
8/32
9/32
కర్ణాటకలోని మైసూర్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్గా మారింది. ‘తలా’ ఫ్యాన్స్ ఈ విగ్రహానికి ఫిదా అవుతున్నారు.
10/32
హైదరాబాద్లోని సోమాజీగూడలో నిర్వహించిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో సామాజిక సేవకురాలు పింకీరెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రకాల దుస్తులు, వస్తువులు, పెయింటింగ్స్ను ప్రదర్శనకు ఉంచారు.
11/32
12/32
విశ్వక్సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రల్లో అశ్వత్ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/32
14/32
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరీకరణతో నూతన భవంతులు వెలిసి హైదరాబాద్లోని చిన్న చిన్న కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిసరాల్లో కొండలు కనుమరుగు కాగా అలంకారప్రాయంగా మిగిలిన కొన్ని బండరాళ్లను చిత్రంలో చూడవచ్చు.
15/32
గుజరాత్లోని మొదేరా గ్రామంలో ఇంటింటికీ సౌర పలకలు అమర్చుకున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9న భారతదేశ మొదటి సోలార్ పవర్డ్ విలేజ్గా ప్రకటించనున్నారు. అక్కడి ప్రభుత్వం చొరవతో మొదేరా సూర్య దేవాలయంతో పాటు గ్రామంలో పూర్తిగా సౌరపలకలు బిగించారు. ఆలయంలో ఈవీ ఛార్జింగ్ను సైతం ఏర్పాటు చేశారు.
16/32
17/32
శిఖర్ ధావన్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలతో కలిసి విమానంలో దిగిన ఫొటోను శ్రేయస్ అయ్యర్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. కాగా గురువారం లఖ్నవూలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. ఈ నెల 9న రాంచీలో రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
18/32
తిరుమల శ్రీవారికి హర్ష టయోటా ఎండీ ఎం.హర్షవర్ధన్ టయోటా రైడర్ కారును విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి కారు తాళాలు అందజేశారు.
19/32
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని స్తర్యి-సాల్టివ్లో వంతెన ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, సైనికులు పడవల్లో సరకులు తెచ్చుకుంటున్నారు.
20/32
దక్షిణ కొరియాలోని సియోల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు గాలిలో ప్లేట్లను పగులకొడుతూ అబ్బురపరిచే విన్యాసాలు చేశారు.
21/32
22/32
23/32
అక్షయ్కుమార్, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో అభిషేక్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ్ సేతు’. ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టర్స్ను స్ఫూర్తిగా తీసుకొని చిత్రబృందం ఓ నూతన పోస్టర్ను విడుదల చేసింది. రామ్ సేతు ట్రైలర్ను ఈ నెల 11న విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
24/32
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్లు, షెడ్లు భక్తులతో నిండిపోవడంతో దర్శనానికి గంటలతరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
25/32
26/32
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల నుంచి పెద్దాపురం వెళ్లే రోడ్డు దుస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు. అధ్వానంగా తయారైన ఈ మార్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జుజ్జూరు గ్రామంలో వరద నీరు ఇలా నిలిచిపోయింది. దీంతో అటుగా సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆ నీటిలో దిగి తన సైకిల్ను శుభ్రం చేసుకున్నాడు. స్థానికులు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి.
27/32
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కొన్ని రోజులపాటు అట్టుడికించిన ఇయన్ హరికేన్ ఎట్టకేలకు శాంతించింది. దీంతో వివిధ పట్టణాలు, ఐలాండ్లలో తీవ్రంగా దెబ్బతిన్న నివాసాలు, కార్లు, బోట్లను బాధితులు మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు.
28/32
29/32
30/32
హైదరాబాద్లోని హకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బలగాలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
31/32
32/32
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!