ధర చూస్తారా..నాణ్యత చూస్తారా..
మనలో చాలామందిమి కూరల్లో గ్రేవీ కోసం టొమాటోలు ఉపయోగిస్తాం. ఈమధ్య వాటి ధర కొండెక్కడంతో కాస్త తగ్గించాం అనుకోండి.
మనలో చాలామందిమి కూరల్లో గ్రేవీ కోసం టొమాటోలు ఉపయోగిస్తాం. ఈమధ్య వాటి ధర కొండెక్కడంతో కాస్త తగ్గించాం అనుకోండి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఓ జంట మిర్చి బజ్జీలు, అరటి బజ్జీలకు భిన్నంగా టొమాటో బజ్జీలతో ఆహార ప్రియులను ఆకట్టుకుంది. ఒకరు టొమాటోలను గుండ్రంగా, సన్నగా తరిగి, వాటి మీద కొత్తిమీర పచ్చడి వేసి శనగపిండిలో ముంచి వేయిస్తుంటే.. రెండోవారు ప్లేటుల్లో అందిస్తున్నారు. వాటికి ఎంత గిరాకీ వచ్చిందంటే ఎంత ఖరీదైనా ఎవరూ వెనకాడటంలేదు. రోజుకు 200 కిలోలకు పైగా అమ్ముడై పోవడమే కాదు.. ధర ఎక్కువైతేనేం.. రుచి అమోఘం- అంటూ ప్రశంసలూ కురిపిస్తున్నారు. అమర్ సిరోహి అనే ఫుడ్ వ్లాగర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షల వీక్షణాలతో వైరల్ అయ్యింది. సరదా కామెంట్లతో నవ్వులు విరబూస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..