90 లక్షల మందికి కొవిడ్ టీకా
రాష్ట్రంలో కొత్తగా సుమారు 90 లక్షల మందికి మార్చి 1 నుంచి కొవిడ్ టీకా ఇవ్వనున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో...
60 ఏళ్లు దాటిన వారికీ అందజేత
దీర్ఘకాలిక వ్యాధులుంటే 45 ఏళ్లు పైబడిన వారికీ ఇస్తారు
రిజిస్ట్రేషన్ లేకున్నా టీకా పొందే అవకాశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా సుమారు 90 లక్షల మందికి మార్చి 1 నుంచి కొవిడ్ టీకా ఇవ్వనున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో ప్రతి ఒక్కరికీ టీకా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు.. గుర్తింపు పొందిన వైద్యులు ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా 45 ఏళ్లు దాటిన వారికీ టీకా ఇస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో 20 రకాలను చేర్చారు. రాష్ట్రంలోని 1,658 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, 564 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము తీసుకొని టీకా పంపిణీ చేయనున్నారు. కొవిన్ యాప్లో ముందస్తు పేర్లు నమోదు చేసుకున్న వారికే కాకుండా... పంపిణీ కేంద్రాలకు వెళ్లిన వారికి కూడా అక్కడి పరిస్థితులను అనుసరించి టీకా వేస్తారు. వీరందరికీ టీకా వేసేందుకు వీలుగా ‘కొవిన్ 1.0’ యాప్ను ‘కొవిన్ 2.0’గా ఆధునికీకరిస్తున్నారు. దీనివల్ల శని, ఆదివారాల్లో టీకా పంపిణీ నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో 67% మంది మొదటి డోసు టీకా పొందారు. ఇతర శాఖల ఉద్యోగులు 6 లక్షల మంది ఉంటే వీరిలో 35% మంది వరకు మొదటి డోసు టీకా పొందారు. ఆరోగ్య సిబ్బందిలో 1.40 లక్షల మంది రెండో డోసూ పొందారు. సోమవారం నుంచి కొవిన్ యాప్లో టీకా అవసరమైన వారు పేర్లు నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
కొవిన్ యాప్లో వివరాల నమోదు ఇలా..!
* ఈ యాప్లో రాష్ట్రంలోని 2,222 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు ఉంటాయి.
* ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
* యాప్లో ఉండే ఆసుపత్రులు, సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు వివరాలు నమోదుచేసుకోవచ్చు.
* పేరు, వయసు, పురుషులు/మహిళలు, పంపిణీ కేంద్రం, సమయాన్ని ఎంచుకోవాలి.
* ఈ వివరాల నమోదు జరిగిన వెంటనే సమయాన్ని (స్లాట్) కేటాయిస్తూ ఫోన్కు సంక్షిప్తసమాచారం వస్తుంది.
నేరుగానూ వెళ్లి వ్యాక్సిన్ పొందొచ్చు..
* కొవిన్ యాప్లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నా...టీకా పొందే సౌలభ్యం ఉంది.
* సంబంధిత కేంద్రంలో ఆ రోజు టీకా వేయించుకునే వారు తక్కువ మంది ఉంటే అవకాశం కల్పిస్తారు.
* దీనికి ముందు వివరాల నమోదు తప్పనిసరి.
* టీకా తీసుకోగానే రెండో డోసు ఎప్పుడు వేయించుకోవాలనే సమాచారం వస్తుంది.
* ప్రాధాన్య క్రమంలో తొలి డోసు పొందిన 29 రోజుల నుంచి 42 రోజుల్లోగా రెండో డోసు వేస్తారు.
* ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీకాను పంపిణీ చేస్తారు.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే స్లిప్పు
వివరాల నమోదు అనంతరం కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా టోకెన్ ఇవ్వాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. యాప్లో ‘స్లాట్’ పొందిన సమయాన్ని డౌన్లోడు చేసుకొనే అవకాశాన్నీ కల్పిస్తారు. ఫోన్కు వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని పంపిణీ కేంద్రాల్లో చూపించినా టీకా వేస్తారు.
జనవరి 1, 2022ను పరిగణనలోకి...
* 45 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాలి.
* 60 ఏళ్లు దాటిన వారికి వైద్యుల సర్టిఫికేట్ అవసరం లేదు.
* వయసు గుర్తించేందుకు జనవరి 1, 2022ను ప్రామాణికంగా తీసుకుంటారు.
గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి!
* ఆధార్ కార్డు* ఫొటోతో కూడిన ఓటరు కార్డు
* డ్రైవింగ్ లైసెన్సు* పాస్పోర్టు
* ఫొటోతో ఉన్న పింఛను డాక్యుమెంట్
* ఎన్పీఆర్ కార్డు
టీకా వేయించుకోకుంటే అఫిడవిట్
ఆరోగ్య సిబ్బందిలో ఎవరైనా సరే టీకా వేయించుకోకుంటే వారి నుంచి అఫిడవిట్ తీసుకుంటున్నారు. ‘‘టీకా పంపిణీ గురించి ఆసుపత్రుల అధికారులు చెప్పారు. అయినా నేను స్వచ్ఛందంగా నిరాకరిస్తున్నాను. దీనికి అధికారులు ఎటువంటి బాధ్యులు కారు’ అని అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులివే
దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో 20 రకాలను కేంద్రం చేర్చింది. 45-59 ఏళ్ల మధ్య వయసు వారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువపత్రం పొందాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు, సంతకం, మెడికల్ కౌన్సెల్ రిజిస్ట్రేషన్ నంబరు, సర్టిఫికేట్ జారీ చేసిన ప్రదేశం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
* రక్తపోటు, చక్కెర వ్యాధి
* గుండె సంబంధిత వ్యాధులు
* మూత్రపిండాలు, కాలెయ సమస్యలు, డయాలసిస్
* బీపీ, షుగర్తో పాటు పక్షవాతం
* దీర్ఘకాలికంగా స్టెరాయిడ్ మందులు వాడేవారు
* ఊపిరితిత్తుల సమస్యతో రెండేళ్లు ఆసుపత్రుల్లో చేరిన వారు
* రక్త సంబంధ క్యాన్సర్లు, ఏడాది నుంచి ఇతర క్యాన్సర్తో బాధపడేవారు
* కండరాలు పనిచేయని వారు
* యాసిడ్ బాధితులు
* సికెల్సెల్, తలసేమియా, బోన్మ్యారో సమస్యలు ఉన్న వారికి
* హెచ్ఐవీ ఇన్ఫెక్షన్/ఇమ్యూనోడెఫిషిన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు