Covid Vaccine: బూస్టర్ తప్పనిసరి
ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్
మూడో డోసు టీకాను వెంటనే ప్రారంభించాలి
అప్పుడే దేశంలో మూడోదశకు అడ్డుకట్ట
‘ఈనాడు’ ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి
అయితరాజు రంగారావు
ఈనాడు - హైదరాబాద్
ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రెండుడోసులు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తూనే.. బూస్టర్ డోసును ప్రారంభించాలని సూచించారు. అలా అయితేనే భారత్లో మూడోదశ ఉధ్ధృతిని నివారించవచ్చని తేల్చి చెప్పారు. మన దగ్గర ఇప్పటికీ డెల్టా కేసులే ఎక్కువగా వస్తున్నాయనీ, ఎక్కువగా జనాలు గుమిగూడిన సందర్భాల్లో వ్యాప్తి చెందిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రెండు డోసుల టీకా పొందినా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దనీ, సత్వరమే పరీక్ష చేయించుకొని అవసరమైన చికిత్సను పొందాలని సూచించారు. ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ విజృంభించడం.. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోన్న నేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వివరించారు.
ఐరోపా దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోంది.. మన దగ్గర మూడోదశ ఉధ్ధృతికి ఇది ప్రమాద ఘంటికా?
ఐరోపా దేశాల్లో చలి వాతావరణం ఉండడంతో వైరస్ వ్యాప్తి ఒక కారణం కాగా.. అక్కడ 30 శాతం మంది ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. అందుకే ఆ పరిస్థితి నెలకొంది. భారత్లో రెండోదశ ఉద్ధృృతి సమయానికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కానీ ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అలా అని అతివిశ్వాసంతో ఉండకూడదు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా, దక్షిణాఫ్రికా వేరియంట్ వచ్చినా.. ఆ ప్రభావం మనపై ఉండకూడదనుకుంటే అందరూ తప్పనిసరిగా రెండుడోసులు వేసుకోవాలి. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 84 రోజుల నుంచి తగ్గించాలి. కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ 28 రోజుల వ్యవధి చాలు. 6 నెలల వ్యవధి అనంతరం బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. మూడో డోసును ఇవ్వడం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చు.
బూస్టర్ డోసుపై శాస్త్రీయ అధ్యయనాలున్నాయా?
బూస్టర్ డోసుపై ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. అమెరికా, యూకే, ఫ్రెంచ్ ప్రభుత్వాలు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలంటున్నాయి. చైనాలో ఇప్పటికే ఇస్తున్నారు. మూడోడోసు తీసుకున్న 6 నెలల తర్వాత కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఇజ్రాయెల్ అధ్యయనం వెల్లడించింది. ప్రఖ్యాత వైద్య పత్రికలు ‘నేచర్’, ‘లాన్సెట్’లోనూ దీనిపై అధ్యయన పత్రాలను ప్రచురించారు. భారత్లోనూ ఐసీఎంఆర్ భువనేశ్వర్లో 600 మందిపై చేసిన ఒక అధ్యయనం వచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతున్నట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది.
* ఏఐజీలోనూ ఈ కోణంలో అధ్యయనం చేస్తున్నాం. దీని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. 500 మంది రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ బారినపడిన వారిని.. 600 మంది ఒక్క డోసు కూడా టీకా తీసుకోకుండా ఇన్ఫెక్షన్ సోకిన వారిని అధ్యయనం చేశాం.రెండు డోసులు పొందినవారిలోనూ 2 శాతం మంది తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. ఎందుకని లోతుగా విశ్లేషిస్తే.. వీరిలో యాంటీబాడీస్ స్థాయి చాలా స్వల్పంగా ఉంది. దీన్నిబట్టి బూస్టర్ డోసు అవసరమనేది స్పష్టమవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా బూస్టర్ డోసును సిఫార్సు చేయలేదు కదా?
ప్రపంచంలోని అందరికీ రెండు డోసులు పూర్తయ్యే వరకూ ఇవ్వకూడదనే నియమంలో భాగంగానే బూస్టర్డోసుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాట్లాడడం లేదు. అయితే అమెరికా, యూకే వంటి దేశాలు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను పాటించడం లేదు. తమ పౌరులకు ఏది లాభం చేకూరుతుందో అదే చేస్తున్నాయి. మనమూ వీలైనంత త్వరగా బూస్టర్ డోసు ప్రారంభించాలి.
ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి?
రెండోడోసు తీసుకున్న 6-9 నెలల మధ్యలో వేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
ఏ టీకాను బూస్టర్గా స్వీకరిస్తే మంచిది?
రెండు డోసులు ఏది స్వీకరించారో.. అదే తీసుకోవచ్చు. లేదా వేరేది కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఒకే రకమైన టీకాను మూడోడోసుగా తీసుకోవడం కంటే.. వేరే రకాన్ని బూస్టర్గా తీసుకుంటే ఇంకా మెరుగ్గా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని మా అధ్యయనంలో గుర్తించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..